సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట ఇస్తే తప్పరు. చెప్పిందే చేస్తారని మరోసారి రుజువైంది. బడుగు, బలహీనవర్గాలు, వెనుకబడిన తరగతుల వారికి రాజకీయంగా అవకాశాలు కల్పించడంలో ఆయన ఎప్పుడూ ముందంజలో ఉన్నారు. ఈ విషయంలో ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. శనివారం 2024 ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించగా అందులో చాలామంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చోటు దక్కింది. మహిళల కోటా కూడా పెంచారు. – ఎంపీ సీట్ల విషయానికొస్తే నాలుగు సీట్లు ఎస్సీలకు, ఒకటి ఎస్టీకి, 11 […]
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైయస్సార్సీపీ తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులును ప్రకటించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మంత్రి ధర్మాన ప్రసాద్, బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అభ్యర్థులను ప్రకటించిన తుది జాబితా ఈ విధంగా ఉంది 1 ఇచ్ఛాపురం – శ్రీమతి పిరియా విజయ 2 పలాస – శ్రీ సీదిరి అప్పలరాజు 3 టెక్కలి – శ్రీ దువ్వాడ శ్రీనివాస్ 4 పాతపట్నం – శ్రీమతి […]
టికెట్ల కేటాయింపులు, అసంతృప్తులు, గొడవలతో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పీకల్లోతు కష్టాల్లో ఉండగా.. వైఎస్సార్ కాంగ్రెస్లో మాత్రం ఫుల్ జోష్ నెలకొంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆ పార్టీలో చేరికలు అమాంతం పెరిగిపోయాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్కు తాకిడి పెరిగింది. వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి పార్టీ కండువాలు కప్పించుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా ఏలూరు జిల్లా ఉంగుటూరు జనసేన నాయకుడు నవుడు వెంకటరమణ వైఎస్ జగన్ సమక్షంలో […]
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, తన కుమారుడు గిరితో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమలో వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ పీవీ మిథున్రెడ్డి, ఎమ్మెల్యే, కాకినాడ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు. ఏపీ రాజకీయాల్లో ముద్రగడకు ప్రత్యేక స్థానం ఉంది. చాలా సీనియర్ నేత. ఉభయగోదావరి జిల్లాలో కాపు […]
టీడీపీ సీనియర్ నేత ఒకప్పటి స్పీకర్, ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు కుటుంబంలో తుని అసెంబ్లీ టికెట్ చిచ్చు రేపింది. యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నెల 17న యనమల కృష్ణుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ వెన్నుపోటు ఉదంతం వేళ చంద్రబాబుకి ముఖ్యమంత్రి పదవి దక్కడంలో అత్యంత కీలక పాత్ర యనమల రామకృష్ణుడిదే. ఆ తరువాత అసెంబ్లీలో ఎన్టీఆర్ తన ఆవేదన చెప్పుకోవటానికి మైకు కూడా […]
డాక్టర్ పి.అనిల్కుమార్ యాదవ్.. మొన్నటి వరకు నెల్లూరు సిటీలో తన మార్క్ని చూపించారు. ఇప్పుడు వైఎస్సార్సీపీ నరసారావుపేట పార్లమెంట్ ఇన్చార్జిగా తనదైనశైలిలో దూసుకెళ్తున్నారు. సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్కు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమోషన్ ఇచ్చి నరసారావుపేట పార్లమెంట్కు పంపారు. ఆయన బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ఆ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎమ్మెల్యేలు, అధికారులను సమన్వయం చేసుకుంటున్నారు. ప్రజాప్రతినిధులతో కలిసి నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. గత ఐదేళ్ల కాలంలో ప్రారంభించిన పనులు.. అవి […]
2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ప్రకటనల్లో మునిగి తేలుతున్నాయి, ఈ విషయంలో అధికార వైసీపీ మిగతా అన్ని పార్టీల కన్నా ముందుందని చెప్పొచ్చు. దాదాపు రెండు నెలలుగా అభ్యర్థుల ఎంపిక పై కసరత్తు చేస్తూ ఎప్పటికప్పుడు విడతల వారీగా జాబితాలు విడుదల చేస్తూ వచ్చింది. ఆయా నియోజకవర్గాల్లో నాయకుల మధ్య ఉన్న సమస్యలు ఒకొకటి పరిష్కారం చేసుకుంటూ నియోజక వర్గాలలో సమన్వయకర్తలను నియమించుకుంటూ ముందుకు వెళ్తోన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ […]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం ప్రజలే. పొత్తు వారితోనే.. అందుకే వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని డిసైడ్ అయిపోయారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద డిజిటల్ బోర్డు ఏర్పాటు చేశారు. జగన్ మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారానికి 73 రోజుల సమయం ఉందంటూ కౌంట్ డౌన్ బోర్డు పెట్టారు. ఇది అందరినీ ఆకట్టుకుంటోంది. 2019 ఎన్నికల సమయంలో బైబై బాబు టైం బోర్డులు పెట్టిన విషయం తెలిసిందే. ఎన్నికల యుద్ధంలో జగన్ […]
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైఎస్సార్సీపీలో చేరబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 14న తన కుమారుడితో కలిసి తాడేపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో ముద్రగడ ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో కిర్లంపూడి నుంచి ర్యాలీగా బయల్దేరి తాడేపల్లి వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. తనతో పాటు మద్దతుదారులంతా తనతో కలిసిరావాలని విజ్ఞప్తి చేశారు. ఆయన లేఖలో ఏం పేర్కొన్నారంటే.. […]
తెలుగుదేశం, జనసేన శ్రేణులకు ఓటమి భయం పట్టుకుంది. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడులకు తెగబడుతున్నారు. రోజూ ఏదో ఒకచోట నేతలపై లేదా వారి ఆస్తులపై రెచ్చిపోతున్నారు. ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు తమవారిని రెచ్చగొట్టేలా ప్రసంగిస్తూ ప్రత్యర్థులపై ఉసిగొల్పుతున్నారు. తాజాగా బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం పుట్టావారిపాళెంలో తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు విధ్వంసకాండ సృష్టించారు. ఆ ఊరిలో రెడ్డి వర్గానికి చెందిన వంద కుటుంబాలు వైఎస్సార్సీపీకి మద్దతుగా ఉన్నాయి. టీడీపీ, […]