‘రాష్ట్రంలో ఐదేళ్లుగా అభివృద్ధి జరగడం లేదు. అన్ని విధాలుగా నాశనమైంది. గాడిలో పెట్టడానికి కేంద్ర సహకారం అవసరం. అందుకే ఎన్డీఏలో చేరా. నాకు అవకాశం ఇవ్వండి. ఏపీని బాగు చేస్తా’ ఎన్నికల సభల్లో తెలుగుదేశం అధ్యక్షుడు చెబుతున్న మాటలివి. ఆయనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి వంత పాడుతున్నారు. కానీ కేంద్రం, రాష్ట్రం అధికారికంగా విడుదల చేసిన గణాంకాలు చూస్తే వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అభివృద్ధి పరుగులు పెట్టిందని ఇట్టే అర్థమవుతుంది. బాబు […]
మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా నిర్వహించిన ముఖాముఖిలో స్థానిక ఎమ్మెల్యే బ్రిజేంద్ర రెడ్డి మాట్లాడుతూ మరో 45 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి అందరూ కూడా రకరకాల జిమ్మిక్కులతో పగటివేషగాళ్ల మాదిరి మీ ముందుకు వస్తున్నారు. మీరు ఇవన్నీ గమనిస్తున్నారు కూడా. మీకు ఈరోజు రెండు విషయాలు చెబుతాను. సీఎం వైయస్ జగన్ 2019లో సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు అధికారంలోకి వస్తే రైతుభరోసా, అమ్మఒడి, చేయూత వంటి సంక్షేమ పథకాలతో నవరత్నాలను ప్రకటించారు. ఆ పాదయాత్రలో మీ […]
నిన్న ప్రొద్దుటూరులో జరిగిన మేమంతా సిద్ధం సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి జగన్ అధికారాన్ని పేదల భవిష్యత్ కోసం, రైతుల కోసం, అక్కచెల్లెమ్మల కోసం, అవ్వాతాతల కోసం, భావితరం పిల్లల కోసం, మన గ్రామాల కోసం, ఇంటింటి అభివృద్ధి కోసం, ఇంటింటి సంక్షేమం కోసం ఒక బాధ్యతగా ఈ 58 నెలల పాలనలో ప్రతి రంగంలోనూ కూడా విప్లవానికి మారు పేరుగా మార్పులు తీసుకురావడమే కాకుండా ఎక్కడా లంచాలు లేకుండా, వివక్షకు తావులేకుండా నేరుగా ప్రజల చేతిలో 2.70 […]
జగన్ సర్కారు రైతుల ఇళ్లలో ఆనందం నింపింది. ఖరీఫ్ సీజన్ లో సేకరించిన ధాన్యానికి ఒక్క రోజులోనే చెల్లింపులు జరపడంతో రైతులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏ ఒక్క రైతూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో 21 రోజుల్లోనే నగదు జమచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు రూ.815 కోట్లను రైతులకు చెల్లించింది. ఇప్పటివరకూ ఖరీఫ్లో సేకరించిన రూ.6,541.23 కోట్ల విలువైన ధాన్యానికి రూ.6,514.59 కోట్లను ప్రభుత్వం చెల్లించగా మిగిలిన మొత్తాన్ని కూడా త్వరలో రైతుల ఖాతాల్లో జగన్ […]
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు కొద్దిరోజుల్లో జరగనున్నాయి. దీంతో వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. నేడు ఇడుపులపాయ నుంచి సీఎం జగన్ మొదటి విడత బస్సు యాత్ర ప్రారంభం కానుంది. మేమంతా సిద్ధం బస్సు యాత్ర ‘సిద్ధం’ సభలు జరిగిన నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు మినహా మిగిలిన 21 పార్లమెంట్ నియోజకవర్గాలలో కొనసాగనుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 21 రోజులపాటు […]
2024 ఎన్నికలకు రెండు నెలల సమయం కూడా లేదు, అధికార వైసీపీలోకి వలసలు ఊపుందుకున్నాయి.ఈ సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి బీజెపీ టీడీపీ జనసేన పార్టీల నుంచి కీలక నేతలు తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర క్యూ కట్టారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో విజయవాడకు చెందిన పలువురు టీడీపీ మాజీ కార్పొరేటర్లు, జనసేన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరిన వారిలో గండూరి మహేష్, నందెపు జగదీష్ […]
ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అభ్యర్థులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే 175 ఎమ్మెల్యే, 24 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన వైఎస్సార్సీపీ ఒక్క అనకాపల్లి ఎంపీ సీటును మాత్రం పెండింగ్లో ఉంచింది. మరోవైపు టీడీపీ,బీజేపీ,జనసేన కూటమిగా పోటీ చేస్తుండగా అనకాపల్లి నుండి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ సీటు దక్కించుకున్నారు. కాగా తాజాగా అనకాపల్లి లోక్సభ స్థానానికి అభ్యర్థి పేరును వైఎస్సార్సీపీ ప్రకటించింది. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడిని అనకాపల్లి […]
జంగా కృష్ణమూర్తి అనే గాలిపటం కొద్దిరోజుల క్రితం తెగిపోయి ఎటెటో తిరిగింది. మళ్లీ పాత గూటికే చేరేందుకు తీవ్ర ప్రయత్నాయాల్లో ఉంది. ఆదరించి అండగా నిలిచిన పార్టీ అయితేనే మర్యాద ఉంటుందని గుర్తించి సంబంధాలు పునరుద్ధరించే పనిలో పడ్డారు ఈ సీనియర్ నాయకుడు. జంగా తెలుగుదేశం మద్దతుతో 1988లో గామాలపాడు సర్పంచ్గా గెలిచారు. 1999లో కాంగ్రెస్ టికెట్పై గురజాల ఎమ్మెల్యేగా ఎన్నియ్యారు. 2004లోనూ గెలుపొంది టీటీడీ బోర్డు సభ్యుడిగా పనిచేశారు. 2014లో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసి […]
ఎలక్ట్రానిక్స్ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారీగా పెట్టుబడులు ఆకర్షిస్తోంది.2019లో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎలక్ట్రానిక్స్ రంగంలో 26,400 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. అందులో ఇప్పటివరకు 10,705 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చాయి. తద్వారా ఎలక్ట్రానిక్స్ రంగంలో 36205 మందికి ఉద్యోగ కల్పన జరిగింది. అంతే కాకుండా మరో 15,711 కోట్ల విలువైన కొత్త పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. ఈ అయిదేళ్ళ కాలంలో ఎలక్ట్రానిక్స్ రంగంలో బ్లూస్టార్, డైకిన్, పానాసోనిక్, […]
హోలీ పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక హోలీ. ప్రజల జీవితాల్లో ఈ పండుగ సుఖసంతోషాలను నింపాలని కోరుకుంటున్నాను. అందరికీ హోలీ శుభాకాంక్షలు’ అంటూ ఎక్స్ ఖాతాలోనూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. కాగా మరో కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే సామాజిక సాధికారికత […]