2024 సార్వత్రిక ఎన్నికల ముందు విజయవాడ పార్లమెంట్ పరిధిలోని వివిధ పార్టీల రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వరసగా పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఈ రోజు గన్నవరం నియోజకవర్గం కేసరపల్లి నైట్ స్టే పాయింట్ వద్ద టీడీపీ , బీసీవై పార్టీ నేతలు ముఖ్యమంత్రి సమక్షంలో వైస్సార్సీపీలో చేరారు. కేశినేని నాని తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరిన తర్వాత ఒకటే నినాదంతో ముందుకు వెళ్తున్నాడు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో […]
ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్సార్ కాంగ్రెస్లో చేరికలు మరింత ఎక్కువయ్యాయి. ప్రతిరోజూ వివిధ జిల్లాల నుంచి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల నాయకులు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి కండువాలు కప్పించుకుంటున్నారు. సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలకు అండగా నిలిచిన మీ వెంటే నడుస్తామని స్పష్టం చేస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లాలో జరుగుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పలువురు పార్టీలో చేరారు. కేసరపల్లి నైట్ స్టే పాయింట్ వద్ద నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గానికి […]
సార్వత్రిక ఎన్నికల్లో తుది అంకానికి వైఎస్ జగన్ రంగం సిద్ధం చేసుకున్నారు. మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర పేరుతో ప్రజల్లోకి ఇప్పటికే వెళ్లిపోయారు. ఈ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఏప్రిల్ 24న శ్రీకాకుళం జిల్లాలో ముగియనుంది. బస్సు యాత్ర ముగిసిన వెంటనే శ్రీకాకుళం నుంచి నేరుగా సీఎం జగన్ పులివెందుల వెళ్లనున్నారు. ఏప్రిల్ 25న పులివెందులలో ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అనంతరం అక్కడ నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల […]
‘ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాల రూపంలో రూ.2.70 లక్షల కోట్లు మీకు అందించేందుకు 130 సార్లు బటన్ నొక్కా. ఒక్క రూపాయి లంచం లేకుండా, వివక్షకు తావు లేకుండా అందించిన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి. మీ బిడ్డ కోసం రెండు బటన్లు ఫ్యాన్ గుర్తు మీద నొక్కండి. ఇందుకు మీరంతా సిద్ధమేనా..’ అన్నారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. గుంటూరు జిల్లా ఏటుకూరులో శుక్రవారం నిర్వహించిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో అశేష జనవాహిని మధ్య సీఎం […]
ఎన్నికల వేళ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు పార్టీలలోని కీలక నేతలు వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా తెలుగుదేశం, బీజేపీల నుంచి ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి పలువురు కీలక నేతలు చేరారు. ఆలూరు నియోజకవర్గం టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ మసాల పద్మజ వైయస్సార్సీపీలో చేరారు. కోడుమూరు నియోజకవర్గం టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో […]
ఎన్నికల నేపథ్యంలో అనేక సర్వే సంస్థలు ఏపీలో సర్వేలు చేస్తూ వాటిని రిలీజ్ చేస్తూ వున్నారు. అలా జాతీయ సర్వే సంస్థ చాణక్య సర్వే ఓనర్ పార్థ దాస్ వెస్ట్ గోదావరి సర్వే చేసి వాటి తాలూకు వివరాలను నిన్న తన ఎక్స్ ద్వారా పంచుకున్నారు. వెస్ట్ గోదావరిలో మహిళల్లో వైఎస్సార్సీపీ కి తిరుగులేని ఆధరణ ఉన్నదని అలాగే పురుషుల్లో కూటమికి ఆధరణ వున్నది అని ప్రకటించారు. చాణక్య సర్వే వెస్ట్ గోదావరి జిల్లాలో మొత్తం సేకరించిన […]
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్ ఈనెల 22న పులివెందులలో నామినేషన్ వేయనున్నట్లు సమాచారం. 18న నోటిఫికేషన్ రానుంది. దీంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 21న సొంత నియోజకవర్గానికి చేరుకుని, రెండు రోజులు అక్కడే ఉండి పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నట్లు సమాచారం. పులివెందుల నియోజకవర్గంలో తన తరపున సతీమణి భారతికి ప్రచార బాధ్యతలు అప్పగించి, జగన్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర కొనసాగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ […]
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల అయ్యప్పనగర్ బైపాస్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థను చూస్తుంటే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్లో శాసనసభ, పార్లమెంటు ఎన్నికల బరిలో నిలవనున్న అభ్యర్థుల రెండో జాబితాను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఆరు లోక్సభ స్థానాలతో పాటు 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు మంగళవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. లోక్సభ స్థానాలకు అభ్యర్థులుగా విశాఖపట్నం నుంచి పులుసు సత్యనారాయణరెడ్డి, అనకాపల్లి నుంచి వేగి వెంకటేశ్, ఏలూరు నుంచి కావూరి లావణ్య, నరసరావుపేట నుంచి గార్నెపూడి అలెగ్జాండర్ సుధాకర్ […]
కూటమి పేరుతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ తమకు కేటాయించిన సీట్లు కూడా తిరిగి టీడీపీకి ఇవ్వడంతో మనస్థాపం చెందిన కీలక నాయకులు జనసేన పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో జాయిన్ అవుతున్నారు. ఈరోజు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీ జనసేనకు రాజీనామా చేసి జగన్ వైసీపీలో సమక్షంలో చేరారు. పాముల రాజేశ్వరీ 2004 లో నగరం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరుపున విజయం సాధించారు. తరువాత […]