ఎన్నికల ముందే బీజేపీ తొలి లోక్ సభ సీటు గెలుచుకొని సంచలనం సృష్టించింది. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్లోని ఐదు అసెంబ్లీ స్థానాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకున్న బీజేపీ తాజాగా సూరత్ లోక్సభ స్థానం కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా విజయం సాధించినట్లు గుజరాత్ బీజేపీ ఎక్స్ ట్విట్టర్లో ప్రకటించింది. వాస్తవానికి సూరత్లో మే 7న ఎన్నికల పోలింగ్ జరగనుంది. కానీ నామినేషన్ల పరిశీలనలోనే కాంగ్రెస్ అభ్యర్థిపై అనర్హత వేటు పడింది. కాంగ్రెస్ అభ్యర్థి […]