మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎల్లో మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పార్టీ మారుతారంటూ కొంత కాలంగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అలా ఏమీ లేదని చాలాసార్లు బాలినేని కొట్టి పారేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఒంగోలులో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఆయన కృషి చేస్తున్నారు. దీనికి సంబంధించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో పలుమార్లు చర్చించారు. ఈ క్రమంలో రూ.202.03 కోట్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం మంజూరు చేసిన విషయం తెలిసిందే. […]