నాగార్జునసాగర్ వివాదం నేపథ్యంలో కేంద్ర జల శక్తి మంత్రిత్వశాఖ ఈరోజు కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. నాగార్జునసా గర్ డ్యాంను సీఆర్పీఎఫ్ కేంద్ర బలగాలకు, నీటి యాజమాన్యాన్ని కృష్ణాబోర్డుకు అప్పగించడంపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. గతంలో అక్టోబర్ 6, 2023 న కృష్ణా రివర్ బోర్డు.. శ్రీశైలంలో 30 TMCలను ఆంధ్రప్రదేశ్కి కేటాయించింది. వాటిలో 15 టీఎంసీలను తెలంగాణ ప్రభుత్వం నాగార్జున సాగర్కి తరలించింది. కానీ ఆ నీటిని ఏపీకి వదల్లేదు. వదలమని కోరినా పట్టించుకోలేదు. […]