ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనైనా వెంటనే స్పందించి ప్రజలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు జరుపుతూ తుఫాను ప్రభావిత ప్రాంతాల గురించి తెలుసుకుంటున్నారు. మిచాంగ్ తుఫానును ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావాన్ని తట్టుకునేందుకు అత్యవసర ఖర్చుల కోసం ప్రభుత్వం ప్రతి జిల్లాకు రూ.2 కోట్లు నిధులు విడుదల చేసింది. తుఫాను పరిస్థితులపై 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో […]
ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల సమీపంలో మిచౌంగ్ తుఫాన్ తీరాన్ని తాకింది. తీరం దాటిన తర్వాత మిచౌంగ్ తుఫాన్ బలహీనపడి సాయంత్రానికి వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని వలన మధ్య ఆంధ్ర ప్రదేశ్ లో విస్తారంగా అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కాగా ఇప్పటికే తుఫాన్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులతో కూడిన వర్షం వల్ల వేలాది ఎకరాల్లో రైతులకు […]