రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వాస్పతుల్లో సౌకర్యాల కల్పనకు అనేక చర్యలు తీసుకుంది. నాడు – నేడు పథకాన్ని ప్రవేశపెట్టి ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి చేసింది. జిల్లా ఆస్పత్రుల రూపురేఖలు మార్చింది. వైద్య సిబ్బంది నియామకం జరిగింది. దీంతో వాటిల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతోంది. గత సర్కారు హయాంలో హాస్పిటళ్లను పట్టించుకోలేదు. వసతులు దారుణంగా ఉండేవి. దీంతో 30 నుంచి 35 శాతమే జరగ్గా వైఎస్సార్సీపీ పాలనలో 46 శాతానికి చేరింది. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో వైద్యారోగ్య […]
వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో వైద్య రంగం బలోపేతమైంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న చర్యలతో పేదలకు నాణ్యమైన వైద్యం అందుతోంది. కరోనా సమయంలో చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. అయితే తెలుగుదేశం ఈ–పత్రిక చైతన్య రథంలో మాత్రం తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దిక్కులేని వైద్యమంటూ కాకి లెక్కలతో కథనాన్ని వండి వడ్డించారు. సీఎంఆర్ఎఫ్ను పట్టించుకోవడం లేదని, ఆరోగ్య కోమాలో ఉందని రాసుకొచ్చారు. అయితే ఇవన్నీ అవాస్తవాలే. గత టీడీపీ ప్రభుత్వం పేదల ఆరోగ్యాన్ని గాలికొదిలేసింది. జగన్ హయాంలో […]