రాష్ట్రంలో నిన్నటి రోజున వాడి వేడిగా సాగిన ఎన్నికలు ముగిసిన తరువాత నేడు తొలిసారి జగన్ తన సందేశాన్ని ప్రజలకు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా తనకు ఆశీస్సులు అందించడానికి సునామీలా వచ్చిన ఓటర్లకు పేరుపేరునా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు చెప్పారు
రాష్ట్రంలో నిన్నటి రోజున వాడి వేడిగా సాగిన ఎన్నికలు ముగిసిన తరువాత నేడు తొలిసారి జగన్ తన సందేశాన్ని ప్రజలకు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా తనకు ఆశీస్సులు అందించడానికి సునామీలా వచ్చిన ఓటర్లకు పేరుపేరునా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. రాబోతే తన ప్రభుత్వంలో మరింత మెరుగ్గా పాలన కొనసాగిస్తానని హామీ ఇచ్చారు.
జగన్ ట్వీటర్ లో పెట్టిన ట్వీట్ యథాతథంగా చూస్తే ” నిన్న జరిగిన ఎన్నికల్లో మండుటెండలు సైతం లెక్కచేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలివచ్చిన నా అవ్వతాతలకు, నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు, నా యవతీయువకులందరికీ పేరుపేరునా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం చెమటోడ్చి శ్రమించిన నా కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.ఇప్పటివరకు సాగిన మన సుపరిపాలన, మరింత మెరుగ్గా కొనసాగుతుందని హమీ ఇస్తున్నాను.” అని తన అభిప్రాయాన్ని పంచుకుని గెలుపు పై ధీమా వ్యక్తం చేశారు.