ఐపీఎల్ 2024 లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఓటమి పాలైంది. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఆర్సీబీ బౌలింగ్ లో రాణించలేక పోయింది, మొదట బ్యాటింగ్ కి దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్నో బ్యాటర్ డికాక్ 56 బంతుల్లో 8 ఫోర్లు 5 సిక్స్ లతో 81 పరుగులు చేసాడు , పూరన్ 21 బంతుల్లో 5 సిక్స్ 1 ఫోర్ తో 40 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు రాహుల్ 20 పరుగులు , స్టోనీష్ 24 పరుగులు సాధించారు
ఆర్సీబీ బౌలింగ్ లో పేలవ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది మాక్సివెల్ తప్ప ఎవరూ సరిగా బౌలింగ్ చేయలేక పోయారుడయాల్ కొంచెం పరవాలేదనిపించాడు, మాక్సివెల్ 2 వికెట్లు డయాల్ , టోప్లే చెరో వికెట్ తీసుకున్నారు.
181 పరుగుల భారీ లక్ష్యంతో దిగిన ఆర్సీబీ బ్యాటింగ్ లో చేతులెత్తేసింది యువ పేసర్ మాయంక్ దాటికి వికెట్లు సమర్పించుకున్నారు, ఫామ్ లో ఉన్న కోహ్లీ ఈసారి నిరాశ పరిచాడు , కెప్టెన్ డూప్లిసిస్ ఫేలవ ఫామ్ కొనసాగుతూనే వస్తుంది. బౌలింగ్ లో రాణించిన మాక్సెవెల్ బ్యాటింగ్ లో పరుగులు ఏమి చేయకుండా వెనుదిరిగాడు. బ్యాటర్ల వైఫల్యంతో ఏ దశలోను కూడా ఆర్సీబీ గెలుస్తుందని పించలేదు. కోహ్లీ 22, ఫాఫ్ 19, రాజత్ 29 పరుగులు చేసారు చివర్లో వచ్చిన లామ్ రోర్ 13 బంతుల్లో 33 పరుగులు చేయడంతో బెంగళూరు గౌరవ ప్రదమైన స్కోర్ చేసి 153 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
మాయాంక్ 3 వికెట్లు , స్టోనిశ్ , సిద్దార్ద్ , నవీన్ బిష్ణోయ్ చెరో వికెట్ తీసుకున్నారు , మాయాంక్ యాదవ్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది