ఐపీఎల్ 2024 సీజన్ లో కొనసాగుతున్న హోం గ్రౌండ్ విజయాల పరంపర.. సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ కి దిగింది, ఢిల్లి కట్టుదిట్టమైన బౌలింగ్ తో పవర్ ప్లే లోనే టాప్ ఆర్డర్ కుప్పకూలినా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు రాణించడంతో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.
ఒకానొక దశలో 10 ఓవర్లకు 58 పరుగులు మాత్రమే చేసిన రాజస్థాన్.. ఇండియా యువ ఆటగాడు రియాన్ పరాగ్ అద్భుతమైన ఆటతో 45 బంతుల్లో 84 పరుగులు ( 7 ఫోర్లు , 6 సిక్స్ లు ) చేయడం , ఆశ్విన్ 29 పరుగులు , జురెల్ 20 పరుగుల సహకారంతో తరువాత 10 ఓవర్లలో 127 రన్స్ చేసి మంచి స్కోర్ చేయగలిగింది. రియాన్ పరాగ్ కు ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం..
186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కు ఓపెనర్లు మెరుపు ఆరంభం ఇచ్చారు. ఆసీస్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్ , మిచెల్ మార్ష్ ఇద్దరూ దూకుడుగా ఆడారు కానీ మార్ష్ ఎంతో సేపు క్రీజులో నిలబడలేకపోయాడు 12 బంతుల్లో 23 పరుగులు చేసి దక్షిణాప్రికా బౌలర్ బర్గర్ కి తన వికెట్ ను సమర్పించుకున్నాడు , తరువాత వచ్చిన బ్యాట్సెమన్ డకౌట్ రూపంలో వెనుదిరుగుతున్నా వార్నర్ మాత్రం తన సహజ ఆటతీరును కొనసాగిస్తూ వచ్చాడు, చివరికి 34 బంతుల్లో 49 పరుగులు చేసి వెనుదిరిగాడు, ఢిల్లీ కెప్టెన్ పంత్ 28 పరుగులు చేసినా దానిని పెద్ద స్కోర్ గా మార్చుకోలేకపోయాడు.
వికెట్లు పడుతూ ఉండటంతో ఒక దశలో గెలుపు అసాధ్యంగానే కనపడింది, ఆ సమయంలో వచ్చిన దక్షిణాఫ్రికా యువ ఆటగాడు స్టబ్స్ మెరుపులతో 23 బంతుల్లో 44 పరుగులు ( 3 సిక్స్ లు , 2 ఫోర్లు ), లక్ష్య చేధనకు దగ్గరగా వచ్చిన ఇంకో ఎండ్ నుంచి ఆటగాళ్ల సరైన సహకారం లేక ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలలో 5 వికెట్లు కోల్పోయి 173 పరుగులు మాత్రమే చేసి గెలుపు ముంగిట టీం బోల్తా కొట్టింది. రాజస్థాన్ రాయల్స్ 12 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది, రాజస్థాన్ బౌలర్స్ బర్గర్ , చాహాల్ చెరో రెండు వికెట్లు తీసుకోగా ఆవేష్ ఖాన్ 1 వికెట్ తీసుకున్నాడు. దీంతో 2024 ఐపీఎల్ సీజన్ లో సొంత గ్రౌండ్ విజయాల పరంపర కొనసాగుతూనే ఉందని చెప్పవచ్చు . టాప్ ఆర్డర్ కోల్పోయి కష్టాల్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ టీం మంచి స్కోర్ సాధించి విజయ అవకాశంలో కీలకపాత్ర పోషించిన రియాన్ పరాగ్ కి ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్ లభించింది.