నేడు ఐపీఎల్ 2024 లో మొహాలీలోని మహారాజా యదవీంద్ర సింగ్ క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. రెండు టీమ్స్ పటిష్టం గానే కనిపిస్తున్నాయి ,. పంజాబ్ కింగ్స్, ఈ సీజన్ లో ఆరు మ్యాచ్ లు ఆడగా కేవలం రెండు మ్యాచ్ లలో గెలిచి, నాలుగు మ్యాచ్ లలో ఓడిపోయి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎనిమిదవ స్థానంలో ఉంది. ఇక మరోవైపు ముంబై ఇండియన్స్ కూడా ఆరు మ్యాచ్ లలో కేవలం రెండు మ్యాచ్ లలో గెలిచి, నాలుగు మ్యాచ్ లలో ఓడిపోయి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 9 వ స్థానంలో ఉంది.
పంజాబ్, ముంబై జట్లు మధ్య ఇప్పటి వరకు ఐపీఎల్ లో 31 మ్యాచ్ లు జరగగా, పంజాబ్ కింగ్స్ 15 మ్యాచ్ లు గెలుపొందగా,ముంబై ఇండియన్స్ 16 మ్యాచ్ లలో గెలిచింది. మొహాలిలోని మహారాజా యదవీంద్ర సింగ్ క్రికెట్ స్టేడియం పేసర్లకు ఎక్కువ అనుకూలమైనది . టాస్ ఎవరు గెలిచినా మొదటగా బౌలింగ్ మాత్రమే తీసుకుంటారు
ప్లెయింగ్ ఎలెవన్ ( అంచనా )
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ , తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా , టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, మహ్మద్ నబీ, జస్ప్రిత్ బుమ్రా, గెరాల్డ్ కోయెట్జీ, ఆకాష్ మధ్వల్
పంజాబ్ కింగ్స్ : జానీ బెయిర్స్టో, ప్రభ్సిమ్రాన్ సింగ్, సామ్ కర్రాన్,లివింగ్స్టోన్, జితేష్ శర్మ,శశాంక్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, రబడ, అర్ష్దీప్ సింగ్ , అశుతోష్ శర్మ