నేడు ఐపీఎల్ లో 17వ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్జట్లు తలపడనున్నాయి. అహ్మాదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్ గత మూడు మ్యాచ్ లలో ఒకటి ఓడిపోయి రెండు గెలవగా, పంజాబ్ కింగ్స్ ఆడిన రెండు మ్యాచ్ లలో ఒకటి ఓడి ఒకటి మాత్రమే గెలిచారు. పంజాబ్ కింగ్స్ కి ఇది ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్.
ఈ పిచ్ బ్యాటింగ్ కి అనుకూలం కాబట్టి టాస్ కీలకం కానుంది, టాస్ ఎవరు గెలిచినా ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువ . ఈ రెండు జట్లు ఇప్పటివరకు 3 సార్లు తలపడగా రెండు సార్లు గుజరాత్ టైటన్స్ , ఒకసారి పంజాబ్ కింగ్స్ జట్లు విజయాలు సాధించాయి