నేడు ఐపీఎల్ లో 17వ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. అహ్మాదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్ గత మూడు మ్యాచ్ లలో ఒకటి ఓడిపోయి రెండు గెలవగా, పంజాబ్ కింగ్స్ ఆడిన రెండు మ్యాచ్ లలో ఒకటి ఓడి ఒకటి మాత్రమే గెలిచారు. పంజాబ్ కింగ్స్ కి ఇది ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్.
ఈ పిచ్ బ్యాటింగ్ కి అనుకూలం కాబట్టి టాస్ కీలకం కానుంది, టాస్ ఎవరు గెలిచినా ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువ . ఈ రెండు జట్లు ఇప్పటివరకు 3 సార్లు తలపడగా రెండు సార్లు గుజరాత్ టైటన్స్ , ఒకసారి పంజాబ్ కింగ్స్ జట్లు విజయాలు సాధించాయి
ప్లెయింగ్ ఎలెవన్ ( అంచనా )
గుజరాత్ :
వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుబ్మన్ గిల్ (కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయి, డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ, స్పెన్సర్ జాన్సన్.
పంజాబ్ కింగ్స్ :
శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్స్టో, ప్రభుసిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ, సామ్ కర్రాన్, లివింగ్స్టోన్, శశాంక్ సింగ్, హరిప్రీత్ బ్రార్, కాగిసో రబడా, రాహుల్ చాహర్