ఐపీఎల్ 2024 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ 8 వికెట్స్ తేడాతో గెలుపొందింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. రహానే 24 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 36 పరుగులు .. జడేజా 40 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్లతో 57 పరుగులు, మొయిన్ ఆలీ 30 పరుగులు చేసారు చివర్లో వచ్చిన ధోని 9 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్ లతో 28 పరుగులు, మెరుపులు మెరిపించాడు
అనంతరం లక్ష్యచేధనకు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 19 ఓవర్లలో 180 పరుగులు చేసి విజయాన్ని నమోదు చేసుకుంది , ఫామ్ లేమితో భాదపడుతున్న లక్నో కెప్టెన్ రాహుల్ ఈ మ్యాచ్ ద్వారా తిరిగి ఫామ్ ని అందుకున్నాడు కేఎల్ రాహుల్ 53 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 82 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు, మరో ఆటగాడు క్వింటన్ డికాక్ 43 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్లతో 54 పరుగులు చేసి రాహుల్ కి తోడుగా నిలిచాడు , నికోలస్ పూరన్ 23 పరుగులు, స్టోయినిస్ 8 పరుగులు చేసారు
చెన్నై బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహమాన్ , పతిరానా చెరో వికెట్ తీసుకున్నారు. జట్టు గెలుపుకి కీలక ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ రాహుల్ కి ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది