ఆదివారం వైజాగ్ వేదికగా డాక్టర్ వైఎస్సార్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ టీంతో జరిగిన మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది , మొదట నాలుగు ఓవర్లు కొంచెం స్లోగా ఆడిన ఢిల్లీ ఓపెనర్లు తరువాత రెచ్చిపోయి ఆడారు , ఈ మ్యాచ్ తో టీంలోకి వచ్చిన పృధ్వీ షా 27 బంతుల్లో 43 ( 4 ఫోర్లు 2 సిక్స్ లు ) డేవిడ్ వార్నర్ 35 బంతుల్లో 52 ( 5 ఫోర్లు 3 సిక్స్ లు ) లతో చెలరేగి ఆడటంతో 9.3 ఓవర్లలోనే ఢిల్లీ జట్టు స్కోర్ 93 పరుగులకు చేరుకుంది
వెంట వెంటనే ఓపెనర్లు ఇద్దరూ వెనుదిరగడంతో స్కోర్ వేగం కొంచెం మందగించినా ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ దూకుడు ఆటతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది , పంత్ 32 బంతుల్లో 51 పరగులు ( 4 ఫోర్లు , 3 సిక్స్ లు) చేసాడు
చెన్నై బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంలో విఫలమయ్యారు , మహేశ్ పక్కన మూడు వికెట్లు తీసుకోగా , జడేజా , ముస్తిఫర్ జా చెరో వికెట్ తీసుకున్నారు
192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఆది లోనే ఆ జట్టు కెప్టెన్ గైక్వాడ్ 1 పరుగుకే వెనుదిరిగాడు ఇంకో ఓపెనర్ కూడా 2 పరుగులకే అవుటవ్వడం ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లక్ష్య ఛేదనలో వెనకబడిపోయారు
మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు రహానే , మిచేల్ లు ఇన్నింగ్స్ ని చక్కదిద్దే ప్రయత్నం చేసిన చెన్నై విజయానికి పెద్దగా దోహదపడలేదు. రహానే 45 పరుగులు, మిచెల్ 34 పరుగులు చేసి వెనుదిరిగారు అప్పటికే చెన్నై ఓటమి ఖాయమైపోయింది
ధోని బ్యాటింగ్ కోసం ఎంతగానో ఎదురు చూసే ఫ్యాన్స్ కి ఈ సారి ధోని బ్యాటింగ్ చూసే అవకాశం వచ్చింది
చివర్లో వచ్చిన ధోని 16 బంతుల్లో 3 సిక్స్ లు 4 ఫోర్ల సహాయంతో 37 పరుగులు చేసి చెన్నై ఫ్యాన్స్ కి ఆనందాన్ని కలిగించారు, చెన్నై నిర్ణీత 20 ఓవర్లలలో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేయగలిగింది
ఢిల్లీ క్యాపిటల్స్ 20 పరుగుల తేడాతో చెన్నై పై గెలిచి ఈ సీజన్ లో మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది
ఢిల్లీ బౌలర్లు ముకేశ్ కుమారు 3, ఖలీల్ అహ్మద్ 2 , అక్షర్ పటేల్ ఒక వికెట్ తీసుకున్నారు
పవర్ ప్లే లో కట్టుదిట్టమైన బౌలింగ్ వేసి చెన్నై ఓపెనర్లను పెవిలియన్ కు పంపిన ఖలీల్ అహ్మద్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది