ఐపీఎల్ 2024 సీజన్ లో 32 వ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఢిల్లీ గుజరాత్ ని కట్టడి చేయడంలో సఫలమైంది . టాస్ ఓడి మొదట బ్యాటింగ్ దిగిన గుజరాత్ టైటాన్స్ ఢిల్లీ బౌలింగ్ ధాటికి ఆ జట్టు బ్యాటర్లు చేతులు ఎత్తేసారు, గౌరవ ప్రదమైన స్కోర్ ని కూడా సాధించలేక చతికిలపడ్డారు గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలలో 89 పరుగులకు ఆలౌట్ అయ్యింది, గుజరాత్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ 31 పరుగులు చేయడంతో ఆ స్కోర్ అయినా సాధించగలిగింది.
ఢిల్లీ బౌలర్ లలో ముకేశ్ కుమార్ 3 వికెట్లు , ఇషాంత్ కిసాన్ , స్టబ్స్ చెరో రెండు వికెట్లు తీసుకోగా ఆక్సర్ పటేల్ , ఖలీల్ అహమ్మద్ చెరో వికెట్ పడగొట్టారు
90 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ అలవోకగా విజయాన్ని నమోదు చేసుకుంది, కేవలం 8.5 ఓవర్ లలోనే లక్ష్యాన్ని చేరుకొని 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది, జాక్ ప్రాసెర్ 20 పరుగులు , హోప్ 19 పరుగులు, పంత్ 16 పరుగులు , పోరెల్ 15 పరుగులు చేయగా గుజరాత్ బౌలర్ లలో సందీప్ 2 వికెట్లు , జాన్సన్ , రషీద్ చెరో వికెట్ తీసుకున్నారు.