నేడు ఐపిఎల్ లో ముంబయికి ముఖ్యమైన మ్యాచ్ జరగనుంది. ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ గత మ్యాచ్ లో విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో ఉంది . పంత్ ఫామ్ లోకి రావడం ఆ జట్టు కి కలిసొచ్చే అంశం. అదే సమయంలో ముంబయి ఇండియన్స్ తొలి మ్యాచ్ లలో తడబడినా కొంత నిలదొక్కుకుంది. ప్లే ఆఫ్ స్థానం కోసం పోరాడుతుంది. ఈరోజు జరిగే మ్యాచ్ లో గెలిస్తే ముంబయి ఇండియన్స్ కు ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా నిలుస్తాయి. అందుకే నేటి మ్యాచ్ ముంబయి ఇండియన్స్ కు కీలకంగా మారనుంది.
బలాబలాలు చుస్తే రెండు జట్లు సమ ఉజ్జివులుగానే ఉన్నాయి , విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.
ఢిల్లీ క్యాపిటల్స్ :
డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, మిచెల్ మార్ష్, పృథ్వీ షా , రిషబ్ పంత్ (కెప్టెన్ & వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్జే, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్.
ముంబై ఇండియన్స్ :
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ , తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా , టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, మహ్మద్ నబీ, జస్ప్రిత్ బుమ్రా, గెరాల్డ్ కోయెట్జీ, ఆకాష్ మధ్వల్