ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదా ఓటర్లు చెక్ చేసుకొని ఏదైనా కారణాలు చేత ఓటర్ లిస్టులో పేరు మిస్సయినా, ఇప్పటివరకూ ఓటు నమోదు చేసుకోకపోయినా వారికి ఈ ఎన్నికలలో ఓటు వేయాలి అనుకునే వారికి ఓట్ల నమోదుకు ఈ రోజు చివరి అవకాశం అని ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయాలనుకుంటున్న వారు తమ ఓటు నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం చివరి అవకాశం ఇస్తోంది. ఇవాళ దరఖాస్తు చేసుకున్న ఓట్లను వారం రోజుల్లో పరిశీలన చేసి ఓటు హక్కు కల్పిస్తారు
దేశవ్యాప్తంగా ఇప్పటికే ఎన్నికల నగరా మోగింది. దేశవ్యాప్తంగా ఎన్నికలను ఏడు దశలలో నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. అందులో భాగంగా ఇప్పటికే మొదటి దశకు సంబంధించి ఏర్పాట్లు చాకచక్యంగా జరుగుతున్నాయి. ఈనెల 19వ తేదీ మొదటి దశ పోలింగ్ జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. మన తెలుగు రాష్ట్రాలలో ఈనెల 18న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ తరుణంలో ఏదైనా కారణం చేత ఓటుని నమోదు చేసుకోకపోయినా, ఓటర్ల లిస్టులో తమ పేరు లేకపోయినా ఓటర్ నమోదుకు చివరి అవకాశం ఎన్నికల సంఘం ఇస్తుంది.
ఇంకా మరి కొద్ది గంటలే అవకాశం ఉంది కనుక ఈ అవకాశన్ని వినియోగించుకొని ఓటు నమోదు చేసుకోమని ఎన్నికల కమిషన్ పిలుపిచ్చింది.