ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు రెండు నెలల సమయం కూడా లేదు కానీ సీట్లు ప్రకటనలో టీడీపీ వెనుకబడిపోయింది. ఇంకా ఇప్పటి వరకు ఒక అభ్యర్థిని ఖరారు చేయలేక తర్జన భర్జన పడుతోంది. దాంతోపాటు చంద్రబాబు ఎక్కడ పోటీ చేస్తాడు అనేది కూడా ధర్మ సందేహంగా మారింది.
ఇవన్నీ చాలదన్నట్లు టీడీపీ – జనసేన పొత్తులో ఏ పార్టీకి సీట్ కేటాయిస్తే తద్వారా ఎవరు పని చేయరో అని టీడీపీ వర్గాల్లో టెన్షన్ పడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. జనసేనతో పాటు బీజేపీతో పొత్తులో వెళ్ళాలి అనుకుంటున్న టీడీపీకి ప్రస్తుతం బీజేపీ వల్ల పెద్ద తలనొప్పి వచ్చి పడేలా ఉంది. చంద్రబాబు అమిత్ షాతో భేటీ అయిన సందర్భంలో 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో 10 ఎంపీ సీట్లు , ప్రతి పార్లమెంట్ పరిధిలో 2 అసెంబ్లీ సీట్లు ప్రతిపాదించారని సమాచారం. ఒకవేళ ఇదే కనుక జరిగితే ఇప్పటికీ జనసేనకు 30 సీట్లు , 5 ఎంపీ ఇస్తున్న నేపథ్యంలో టీడీపీ నమ్ముకొని ఉన్న అభ్యర్థుల పార్టీకి ఎదురుతిరిగే పరిస్థితి నెలకొంది. పార్టీనే నమ్ముకొని ఉన్న సీనియర్ టీడీపీ కుటుంబాలకు కూడా ఒకటే టికెట్ ఇస్తా అన్నట్లు సమాచారం. అలా జరిగితే ఆయా నాయకులు ఏ మాత్రం టీడీపీకి సహకరిస్తారనేది అనుమానాస్పదంగా మారింది. ఏది ఏమైనా రానున్న రోజుల్లో అభ్యర్థుల ఎంపిక చంద్రబాబు కష్టతరంగా మారింది..