ఒక్క హామీని కూడా నెరవేర్చలేక పోయింది వైసిపి అని శంఖారావంలో ప్రాంతీయ పార్టీ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించాడు. కానీ నిజానికి 2019 కి ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మేనిఫెస్టోని 2014 ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోని ఎదురెదురుగా పెట్టుకొని చూస్తే టీడీపీ పార్టీ ఒక్క హామీని కూడా సక్రమంగా నెరవేర్చలేకపోయిందని పసి పిల్లోడు కూడా చెబుతాడు. అదే వైసిపి 2019లో ఇచ్చిన మేనిఫెస్టో చూస్తే 98 శాతం హామీలను నెరవేర్చింది. ఆ నిజాన్ని మరచి పదేపదే ఇలా మేనిఫెస్టో పై విమర్శలు చేస్తున్న లోకేష్ కావాలనే టిడిపిని ఇరకాటంలో పడేయాలని చూస్తున్నాడా? వైసిపి హామీలు నెరవేర్చలేదు అనే మాట పదేపదే అనడంతో ఏమేమి హామీలు నెరవేర్చాడు ఏమి నెరవేర్చలేదు అనే అంశం తెరపైకి వచ్చినప్పుడల్లా వైకాపా 98 శాతం తాము ఇచ్చిన హామీలను అమలు చేశారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు టిడిపి 2014లో ఇచ్చిన మేనిఫెస్టోను తిరిగేసి చూస్తే ఒక్క హామీని సక్రమంగా నెరవేర్చలేని వైఫల్యం కనబడుతుంది. ఇవేవి పట్టకుండా లోకేష్ మాట్లాడిన మాటల నుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు నాన తిప్పలు పడాల్సి వస్తుంది. లోకేష్ పదేపదే తన అవివేకపు మాటలతో ఇదే అంశాన్ని తెరపైకి తెచ్చి చంద్రబాబుని ఇరకాటంలో పెడతున్నాడు
ఒకసారి 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీలు చూస్తే 650 హామీలు ఇచ్చి ఏ ఒక్కటి సరిగ్గా నెరవేర్చిన పాపాన పోలేదు. చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోని టిడిపి వెబ్సైట్ నుంచే తొలగించాలంటే మనము అర్థం చేసుకోవచ్చు. ఏ మతాన్ని ఏ రంగాన్ని ఏ కులాన్ని వదలకుండా అన్నిటికీ చాట భారతం అన్ని హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చని ఘనత చంద్రబాబు కి దక్కుతుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే 2019 సాధారణ ఎన్నికల ముందు నవరత్నాలు అంటూ తాను ముఖ్యమంత్రి అయ్యాక అమలు చేస్తానని చెప్పి ఎన్నికలకి వెళ్లిన జగన్ ఆంధ్ర ప్రదేశ్ కి ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయ్యిన తర్వాత నన్ను చెప్పిన విధంగా తన మేనిఫెస్టోను ఒక భగవద్గీత ఒక బైబిల్ ఒక ఖురాన్ గా భావించి తాను చెప్పిన ఇచ్చిన నవరత్నాల హామీలు 98 శాతం పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. తన పాలనను ఎప్పుడూ సంక్షేమ అభివృద్ధి అనే బాటలో నడిచింది. సీఎం జగన్ తాను చెప్పని ఎన్నో కార్యక్రమాలను కూడా చేశాడు. ఇలా టిడిపి వైకాపాల మేనిఫెస్టోలోని అంశాల అమలను బేరీజు వేసుకుంటే రెండు ప్రభుత్వాలు మధ్య నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. చెప్పిన హామీలన్నీ నెరవేర్చి ప్రజా గుండెల్లో నిలిచింది జగన్ అయితే, చెప్పిన హామీలన్నీ నెరవేర్చుకున్న ప్రజల గుండెల్లో ద్రోహిగా నిలిచింది మాత్రం చంద్రబాబు. ఇలా లోకేష్ మేనిఫెస్టో అని పదేపదే గుర్తు చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీకి బొక్క తప్ప మరొకటి లేదు.
ఈ విషయాన్ని కూడా లోకేష్ ఎఱ్ఱ బుక్కులో రాసుకొని రోజూ చదువుకోంటుంటే ఈసారి ఇలా తప్పుడు ఆరోపణలు చేసే కష్టం తప్పుతుంది లోకేష్ కి