2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నాయకుల మధ్య ఉన్న సమస్యలు ఒక్కొకటిగా పరిష్కరిస్తూ, నిజయోజకవర్గాలలో సమన్వయకర్తలను నియమించుకుంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 8వ జాబితాను విడుదల చేసింది. గుంటూరు పార్లమెంట్ నుంచి కిలారు రోశయ్య, ఒంగోలు పార్లమెంట్ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కందుకూరు అసెంబ్లీ నుంచి బుర్రా మధుసూదన్ యాదవ్ , పొన్నూరు అసెంబ్లీ నుంచి అంబటి మురళి, గంగాధర నెల్లూరు అసెంబ్లీ నుంచి కృపాలక్ష్మిలను సమన్వయకర్తలగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు నియమించినట్లు విజయసాయి రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఇప్పటికే బూత్ లెవెల్ స్థాయి అభ్యర్థలతో మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఎన్నికల సరళి ముగిసేలోపు ప్రతి గడపకు అయిదు సార్లు వెళ్లి ప్రభుత్వం చేసిన మంచిని తెలియజేయాలని సీఎం జగన్ దిశా నిర్దేశం చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఎటువంటి పొరపాట్లకి తావు ఇవ్వకుండా చూడాలని ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఇదే సందర్భగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ మార్చి 3న జరగాల్సిన సిద్ధం సభ మర్చి 10వ తేదీకి మార్పు చేసినట్లు ప్రకటించారు.