ఏపీలో ఫ్యాన్ ప్రభంజనం కొనసాగుతుందని మరో సర్వే స్పష్టం చేసింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా కొనసాగనుందని పలు సర్వేలు స్పష్టం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జీన్యూస్ మ్యాట్రైజ్ పోల్ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ వైఎస్సార్సీపీకి పట్టం కట్టనున్నట్లు వెల్లడించింది.
జీన్యూస్ మ్యాట్రైజ్ ఒపీనియన్ పోల్ సర్వే ప్రకారం ఏపీలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో మొత్తం 25 స్థానాలకు గానూ 19 స్థానాలు గెలుచుకుంటుందని వెల్లడించింది. టీడీపీ జనసేన కూటమి 6 స్థానాలకు పరిమితం కానుందని, బీజేపీ & కాంగ్రెస్ పార్టీలు ఖాతా కూడా తెరిచే అవకాశం లేదని అభిప్రాయపడింది. జీ న్యూస్ మ్యాట్రైజ్ ఒపీనియన్ పోల్ ప్రకారం మరోసారి ఏపీలో జగన్ ప్రభంజనం కొనసాగనుందని తేలడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అవినీతికి తావులేని పారదర్శక పాలన వల్లనే సీఎం జగన్ కు ప్రజాదరణ దక్కుతుందని పలువురు అభిప్రాయం పడుతున్నారు.
గతంలో ‘టైమ్స్ నౌ’ సర్వే కూడా ఏపీలో వైఎస్సార్సీపీ అత్యధిక లోక్సభ సీట్లు గెలుచుకుంటుందని వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంట్ స్థానాలకు గాను అధికార వైఎస్సార్సీపీ 19 స్థానాల్లో విజయ దుందుభి మోగిస్తుందని టీడీపీ జనసేన కూటమి 6 స్థానాలను మాత్రమే గెలుచుకుంటుందని స్పష్టం చేసింది. ఏ సంస్థ సర్వే చేసినా వైఎస్సార్సీపీ విజయం తథ్యం అని వెల్లడిస్తుండడంతో ఆ పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.