జగన్ సర్కారు ప్రతినెలా ఇచ్చే సామాజిక పింఛను మొత్తాన్ని జనవరి నుండి రూ.2,750 నుంచి రూ.3,000కు పెంచనుంది. దీంతో పింఛన్ అందుకుంటున్న అవ్వాతాతలు, వితంతు, ఒంటరి మహిళ, వివిధ రకాల చేతి వృత్తిదారులకు మరింత ఆర్ధిక చేయూత లభించనుంది. కాగా ముఖ్యమంత్రి జగన్ జనవరి నుండి రూ.3,000 మొత్తాన్ని అందించనున్నట్లు నెలన్నర క్రితమే ప్రకటించారు. కాగా పెంపు తర్వాత పింఛన్ల వ్యయం రూ.2 వేల కోట్లకు పెరగడం గమనార్హం.
అర్హులైన ప్రతీ ఒక్కరికీ పింఛన్ అందాలని ముఖ్యమంత్రి పింఛన్ల పంపిణీలో జగన్ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. దాంతో ప్రతి పది మందిలో దాదాపు నలుగురికి వైఎస్ జగన్ సీఎం అయ్యాకే పింఛన్ అందడం విశేషం. ఈ నాలుగున్నరేళ్లలో 28,26,884 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసినట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు వెల్లడించారు. ఈ డిసెంబర్ నెలలో అక్షరాలా 65,33,781 మంది లబ్ధిదారులకు పింఛన్లు అందించింది రాష్ట్ర ప్రభుత్వం.
చంద్రబాబు హయాంలో ప్రతీనెలా పింఛన్ ల కోసం పెట్టిన ఖర్చు రూ.400 కోట్లు మాత్రమే. ప్రభుత్వంపై భారం పడుతున్నా అర్హులైన పేద ప్రజలకు పింఛన్ దక్కాలని పించన్ ని గణనీయంగా పెంచింది జగన్ సర్కారు. గతంలో మాదిరి కాకుండా వలంటీర్ వ్యవస్థ ద్వారా అర్హులైన ప్రతీ ఒక్కరి ఇంటికే వెళ్లి సంక్షేమ ఫలాలు అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటివరకు ప్రతినెలా పింఛన్ల పంపిణీ కోసం రూ.1,800 కోట్లకు పైగా ఖర్చవుతుండగా జనవరి నుంచి దాదాపు రూ.2,000 కోట్లకు పెరిగే అవకాశముంది.