“సిద్దం” అంటూ ఎన్నికల సమరానికి తాము సిద్ధంగా ఉన్నామని క్యాడర్ లో నూతన ఉత్సాహాన్ని నింపుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న సభలు కనీవినీ ఎరుగని రీతిలో సక్సెస్ అవుతున్నాయి.. ఈనేపథ్యంలో వైసీపీ నూతన నినాదాలతో దూసుకుపోతుంది…
వైఎస్సార్ అంటేనే రైతు బాంధవుడు, అలాంటి వ్యక్తి కి కొడుకైన జగన్ తన తండ్రిలా ప్రజల గుండెల లో నిలిచిపోవాలని రైతులకు మరింత మేలు చేయాలని సంకల్పించి, అధికారంలోకి వస్తే రైతులకు పెట్టుబడి సాయం అందిస్తానని మాటిచ్చి, అధికారంలోకి రాగానే ప్రతీ రైతు కుటుంబానికి 13500 రూపాయల చొప్పున అందిస్తుంది జగన్ ప్రభుత్వం…
గ్రామ స్వరాజ్యం సాకారం చేయడం లో భాగం గా ప్రతీ గ్రామంలో రైతు భరోసా సెంటర్లు కట్టించి ఏ నేలకు ఏ పంట వేయాలి? ఏ ఎరువులు వాడాలని సూచనలు ఇస్తూ, సబ్సిడీ పై ఎరువులు, పురుగుమందులు అందించేలా ఏర్పాట్లు చేసింది జగన్ ప్రభుత్వం…
రైతుల పంటల ధరలు హెచ్చు తగ్గులు వలన నష్టపోకుండా ధరలను స్థిరీకరించడానికి ధరల స్థిరీకరణ నిధిని ప్రతీ ఏటా ఏర్పాటు చేసి రైతుల గిట్టుబాటు ధరకు ఏ ఆటంకం కలగకుండా చర్యలు చేపడుతుంది ఈ ప్రభుత్వం.. స్థానిక మార్కెట్లలోనే గిట్టుబాటు ధర కల్పిస్తూ వాటిని బలోపేతం చేసింది..
కేంద్ర ప్రభుత్వం 24 రాకాల పంటలకు ఇచ్చే మద్దతు ధర జాబితాలో లేని అరికెలు, అండుకొఱ్ఱ, కొర్ర, సామెలు, ఊదలకు కూడా కనీస మద్దతు ధర నిర్ణయించి తృణ ధాన్యాల పంటలను, మెట్ట వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహిస్తుంది.. మిరప, పసుపు, ఉల్లిగడ్డల పై కనీస మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించి ఇస్తుంది…
ఇక పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ లను శరవేగంగా పూర్తి చేస్తూ వ్యవసాయానికి నీరు అందించాలని ప్రతీ ఎకరాన్ని తడపాలని సంకల్పించి చిత్తశుద్ధితో పని చేస్తుంది. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసింది ఈ ప్రభుత్వం, పోలవరం పనులు శరవేగంగా జరుగుతున్నాయి, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ పెంచి గతంలో 44000 క్యూసెక్కులు ఉన్న కెపాసిటీ ని 89000 క్యూసెక్కులకు పెంచి సీమకు నీరందిస్తుంది, శ్రీశైలం నుండి కుప్పం వరకు నీళ్లు అందించడం రైతుల కష్టాలపై జగన్ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి నిదర్శనం..
కేంద్ర సాకారంతో ఒకేసారి 11 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లు స్థాపించడమే కాకుండా, ప్రైవేటు రంగంలో అనేక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లు నెలకొల్పేలా ప్రోత్సహించి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులలో ఏటా 10% పైగా వృద్ధిని సాధించేంతగా, మత్స్యసంపద వృద్ది కి కృషి చేస్తూ ఎగుమతులలో దేశంలో మొదటి రెండు స్థానాల్లో నిలపడానికి ఈ ప్రభుత్వ కృషి ఎంతో ఉంది..