ఏపీ సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న బస్సు యాత్రలో తన పై దాడి జరిగిన విషయం తెలిసిందే, దాడి జరిగిన తరువాత ఒకరోజు విశ్రాంతి తీసుకొన్న జగన్ ఈరోజుతిరిగి బస్సు యాత్ర కేశనపల్లి నుండి మొదలు అయిన సందర్బంలో కేశనపల్లి స్టే పాయింట్ లో జగన్ను పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున తరలి వచ్చి జగన్ కు సంఘీభావం తెలిపి పరామర్శించారు. జగన్ను కలవడానికి వచ్చిన నేతలు జగన్ దెబ్బ గురించి, వాపు, నొప్పి గురించి వాకబు చేశారు. జగన్ వచ్చిన ప్రజా ప్రతినిధులను ఆప్యాయంగా పలకరించి ప్రతి ఒక్కరికీ తన యోగ క్షేమాల గురించి వివరిస్తూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ముందుకు సాగడమే అని మనో ధైర్యాన్ని కల్పించారు.
అక్కడకి వచ్చిన ప్రతి నాయకుడిలో జగన్ దెబ్బ మీద తీవ్ర ఆందోళనతో కనిపించారు. జగన్ అందరినీ నవ్వుతూ పలకరిస్తూ ధైర్యం చెబుతూ పలకరించారు. ఈ దాడులతో మన విజయాన్ని ఆపలేరు మన యాత్ర ను అడ్డుకోలేరు, బస్సు యాత్రలో భాగంగా పార్టీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే మన యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది అని, ప్రజల మద్దతు మనకు వుందని జగన్ తెలిపారు. జగన్ను చూడటం కోసం ఉమ్మడి కృష్ణ జిల్లా నుండి కాకుండా రాష్ట్రం నలుమూలల నుండి వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి తమ మద్దతును తెలియపరిచారు.
ముఖ్యమంత్రిని జగన్ ను కలిసిన వారిలో శాసనమండలి చైర్మన్ కె మోషేన్ రాజు, మంత్రులు జోగిరమేష్, కారుమూరి నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయవాడ ఎంపీ కేశినేని నాని, రాజ్య సభ ఎంపీ ఆయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్, ఒంగోలు వైయస్సార్సీపీ ఎంపీ అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి,మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్ధి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, కైలే అనిల్ కుమార్, కొడాలి నాని, పేర్ని నాని, పెడన వైసీపీ అభ్యర్థి ఉప్పాల రాము, కృష్ణ జిల్లా జెట్పి ఛైర్మన్ ఉప్పాల హారిక , ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్ధి దేవినేని అవినాష్, మైలవరం అభ్యర్ధి సర్నాల తిరుపతిరావు, డాక్టర్ దుట్టా రామచంద్రరావు సహా పలువురు ఇతర నేతలు వున్నారు.