వై నాట్ 175 అనే సీఎం వైయస్ జగన్ నినాదాన్ని అమలు చేసి చూపించే శక్తి ఈ రాష్ట్రంలోని మహిళలకు సాధ్యమని వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి శ్రీమతి వాసిరెడ్డి పద్మ ముఖ్య అతిథిగా పాల్గొన్న పద్మ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కుటుంబంలో తండ్రి, బిడ్డలు మహిళలకు ఇవ్వని గుర్తింపు సమానత్వం సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చారని, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని కోట్లాదిమంది మహిళలు హారతి పడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్కి బిగ్ థాంక్స్ చెబుతున్నామని ఆమె వెల్లడించారు.
మహిళల పేరిట ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్లు నిర్మిస్తున్నారని, ప్రతి పథకంలోనూ మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యతతో మహిళలకు గుర్తింపు, సమానత్వం వచ్చిందని, సీఎం వైయస్ జగన్ తీసుకొచ్చిన దిశ యాప్ మహిళల కు రక్షణ, ధైర్యాన్ని ఇస్తుందని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. మహిళకు 50 శాతం రిజర్వేషన్ అసెంబ్లీలో చట్టం చేసిన ఘనత ఒక్క సీఎం జగన్ కే దక్కుతుందని, వై నాట్ 175 అనే సీఎం వైయస్ జగన్ నినాదాన్ని అమలు చేసి చూపించే శక్తి ఈ రాష్ట్రంలోని మహిళలకు సాధ్యమని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. వైయస్ జగన్ ప్రభుత్వానికి మద్దతుగా ప్రచారం చేయడానికి మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసినట్లు వాసిరెడ్డి పద్మ తెలిపారు. కాగా ఈ కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, ఉపాధ్యక్షులు, జోనల్ కమిటీ చైర్మన్లు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అమ్మాజీ, ఏపీఐసీ చైర్మన్ బండి పుణ్యశీల తదితరులు పాల్గొన్నారు.