వ్యవసాయం దండగ అన్నవారికి రైతు ఇప్పుడు గుర్తొచ్చాడా..
గతంలో చంద్రబాబు రైతుల విషయంలో మాట్లాడిన మాటలు రైతులు మర్చిపోలేదు . రైతును రాజుగా కొలిచే ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయం దండగ అన్న ఒకే ఒక నాయకుడు చంద్రబాబు.. ఉచిత విద్యుత్ ఇస్తే కరెంట్ తీగల బట్టలారేసుకోవడానికి తప్ప ఇంకెందుకు పనికిరావు అన్నాడు.. ఎప్సటికప్పుడు రైతులను కించపరుస్తూ వచ్చాడు.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు. రైతులు సమస్యలు చెప్పుకోవటానికి వెళ్తే బుల్డోజర్లతో తొక్కించాలన్న వ్యక్తి చంద్రబాబు.
అలాంటి వ్యక్తి ప్రస్థుతం రైతులపై విపరీతమైన ప్రేమ చూపిస్తున్నాడు. 2024 ఎన్నికల కోసం చంద్రబాబు రైతులను కాకా పడుతున్నారు. పద్నాలుగేళ్ళ కాలం ముఖ్యమంత్రిగా ఉన్నా చంద్రబాబు రైతులకు ఏం చేసాడంటే చెప్పుకునే రీతిలో ఏమీ చెయ్యలేదు. కానీ కేవలం ఐదేళ్ళ పరిపాలన కాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో రైతులను ఆదుకోవడంతో పాటు.. వ్యవసాయం చేస్తే నష్టమొస్తుందేమోనన్న భయాన్ని రైతులలో పూర్తిగా పోగొట్టారు. రైతులకు పెట్టుబడి సహాయం అందించేందుకు వైఎస్సార్ రైతు భరోసా ను ప్రారంభించారు.
విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అంటూ వ్యవసాయోత్పత్తులన్నీ నాణ్యమైనవే రైతులకు అందించేందుకు ఆర్బీకేలు స్థాపించారు. పంట బీమా, ఇన్ పుట్ సబ్సీడీ, యంత్ర సేవా కేంద్రాలు అంటూ రైతు వ్యవసాయాన్ని పండగలా జరుపుకునేందుకు అన్ని విధాలుగా రైతులకు ముఖ్యమంత్రే తోడున్నారు. టీడీపీ హయాంలో విత్తనాలు కోసం క్యూ లైన్లో నిలబడి రైతులు ప్రాణాలు కోల్పోయిన సంగతి రాష్ట్రంలోని రైతులెవ్వరూ మర్చిపోలేదు. చంద్రబాబు రైతుల పాలిట శాపం.
నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం చేస్తూ.. రైతులను ప్రతి సంవత్సరం కరువు కాటకాలు పట్టి పీడించేలా చేసి శునకానందం పొందాడు చంద్రబాబు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక నీటిపారుదల ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ రాష్ట్రంలో పంట సాగు పెరిగేలా చేశారు.
మొన్న మిచాంగ్ తుఫాను సమయంలో వైఎస్సార్సీపీ స్పందించిన తీరు.. రైతులను ఆదుకున్న విధానం అభినందించాల్సిన విషయం. కేవలం 48 గంటల్లో 1.07 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతులకు తోడుగా నిలిచింది. రెండు రోజులు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించిన చంద్రబాబు ప్రభుత్వంపై ఏవేవో అర్ధం లేని ఆరోపణలు చెయ్యాలనుకున్నా వీలు లేకుండా పోయింది. అంత పకడ్బందీగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. సహాయక చర్యలపై సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేయటమే కాకుండా ప్రభావిత ప్రాంతాల్లోనూ పర్యటించి రైతులకు భరోసా ఇచ్చారు.
తుఫాను ప్రభావానికి గురైన తిరుపతి జిల్లాలోని స్వర్ణముఖి బ్యారేజ్, బాలిరెడ్డి గ్రామస్తులతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖాముఖి చర్చించారు. బాపట్లలోనూ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సీఎం జగన్ రైతులకు భరోసా ఇచ్చారు. అయితే అదే రోజు చంద్రబాబు కూడా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు కానీ ప్రభుత్వ వైఫల్యం ఇదని చంద్రబాబు చూపించలేకపోయాడు. నోటికి వచ్చినట్లు ఏదేదో మాట్లాడటం తప్ప ఆయన చూపించడానికి అక్కడ ఎటువంటి పొరపాట్లు లేవన్నది సత్యం. విపత్తు సమయంలో రాజకీయాలకు అతీతంగా ప్రజలకు తోడుగా ఉండాలి. కానీ టీడీపీ శైలి భిన్నం..
ఒకవైపు తుఫాను బీభత్సంలో రైతులు అష్టకష్టాలు పడుతుంటే, వారికి తోడుగా నిలిచేందుకు ప్రభుత్వం తన పనిలో తాను తలమునకలై ఉండగా టీడీపీ అసత్య ఆరోపణలు చేస్తూ తన విపరీత బుద్ధిని చూపిస్తుంది. ఇది ఒక్కసారి ఒక్క రోజూ జరిగింది కాదు ప్రతిసారి ఇదే వైఖరి..
వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వేలో పరిశీలించడానికి హెలికాఫ్టర్ లో ప్రయాణం చేస్తూ బ్రేక్ ఫాస్ట్ చేస్తాడు చంద్రబాబు.. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలతో మమేకమై వారి కష్టాలు అడిగితెలుసుకుంటారు. ప్రజలను రైతులను జాగ్రత్తగా చూసుకోవాలంటూ అధికారులను ఆదేశిస్తారు. ప్రకృతి బీభత్సంలో చెట్లు పడిపోతే చంద్రబాబు వెళ్ళి వాటిని కట్ చేస్తున్నట్టు ఫోటోలకు ఫోజులిస్తూ, అధికారుల పనులకు అడ్డం వస్తూ అప్పటికే ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఇంకా ఇబ్బందులకు గురిచేస్తారు. ప్రచార ఆర్భాటం తప్పా పనికొచ్చే పనులు ఒక్కటీ చెయ్యడు చంద్రబాబు.
రైతును రాజుగా చూస్తూ రాష్ట్రంలో వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు రైతులంతా తోడై ఉన్నారు. రానున్న రోజుల్లో చంద్రబాబుకు రైతులే గట్టిగా బుద్ధి చెబుతారు.