గత అయిదేళ్ళుగా జగన్ పాలనలో రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది అనీ, అరాచక పాలన సాగిందనీ, అభివృద్ధి శూన్యమనీ, పధకాల పేరుతో డబ్బుని పప్పు బెల్లాలుగా పంచిపెట్టారని బాబు & కో పాపం గుండెలు బాదుకుంటూ ఉన్నారు. ఒకానొక సమయంలో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని కూడా చెప్పారు ఈ పధకాల వల్ల. కానీ వాళ్ళు మేనిఫెస్టోలో ఈ పధకాలకే పేర్లు మార్చి చేర్చారనుకోండి అది వేరే విషయం.
అయితే, నిజానికి బాబు పాలన కన్నా జగన్ పాలన మెరుగ్గా సాగింది. పైగా రెండేళ్ళు కరోనా రాష్ట్ర ఆదాయాన్ని అతలాకుతలం చేసింది. ప్రజలు జీవన విధానం గతి తప్పింది. కానీ జగన్ పాలన గాడి తప్పలేదు. వివిధ అంశాల్లో జగన్ పాలన బాబు పాలన కన్నా మెరుగ్గా ఎలా సాగిందో చూద్దాం.
పెట్టుబడులు:
2014–18 మధ్య బాబు హయాములో రాష్ట్రంలోకి వచ్చి న పెట్టుబడులు -రూ.32,803 కోట్లు. 2019 నుంచి 2023 జూన్ వరకు వచ్చి న పెట్టుబడులు -రూ.1,00,103 కోట్లు. రెండేళ్లు కరోనా ఉన్నా భారీ పెట్టుబడులను ఆకర్షించింది జగన్ సర్కారు. 2022లో రూ.45,217 కోట్ల పెట్టుబడులు తేవడం ద్వారా దేశంలోనే అగ్రస్థానం సాధించింది. ఈ విషయం కేంద్ర వాణిజ్య శాఖ కి చెందిన డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఫర్ ఇండ్రస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) తెలిపింది.
విశాఖ జీఐఎస్లో పెట్టుబడుల సదస్సు (మార్చి 2023 ) జరిగి ఏడాది కాకుండానే 19 శాతం పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చేశాయి. మార్చి 2023 లో విశాఖ జీఐఎస్లో పెట్టుబడుల సదస్సు లో మొత్తం రూ.13.11 లక్షల కోట్ల విలువైన 386 ఒప్పందాలు జరగ్గా వీటి ద్వారా మరో 6.07 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ఏడాది లోపే రూ.2.46 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన పరిశ్రమల పనులు వేర్వేరు దశల్లో ఉన్నాయి.
ఇక సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు(MSME ) సంఖ్యను చూస్తే… 2019 లో బాబు దిగిపోయేనాటికి -1,93,530 కాగా 2023 ఆగస్టు 31 నాటికి -7,72,802. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యమ్ పోర్టల్ ఇచ్చిన గణాంకాలు అంటే కొత్తగా 5,79,272 ఎంఎస్ఎంఈలు ఏర్పాటు అయ్యాయి.ఈ నాలుగున్నర ఏళ్లలో కొత్తగా 15 లక్షలకు పైగా ఉపాధి లభించింది.
బాబు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు-34 వేలు కాగా జగన్ ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు-2. 21 లక్షలు కాంట్రాక్టు (34 ,712 ) అవుట్ సోర్సింగ్ (3,83,734) , ప్రభుత్వ ఉద్యోగాలు (2. 21 లక్షలు ) కలిపి ఇచ్చిన ఉద్యోగాలు- 6.40 లక్షలు. జగన్ పాలనలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు 16 లక్షలు వచ్చాయని రాజ్యసభలో కేంద్ర కార్మిక ఉపాధికల్పనశాఖ మంత్రి డిసెంబర్ 21, 2023న ప్రకటించారు కూడా.
పోర్టుల నిర్మాణంలో, రూ.16 ఎలా కోట్ల వ్యవయంతో శరవేగంగా రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్ వే పోర్టుల నిర్మాణం జరుగుతోంది. ఈ పోర్టుల నిర్మాణంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 75,000 మందికి ఉపాధి వస్తుంది. ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
మత్స్యకారుల ఉపాధికి ఊతమిస్తూ రూ. 4 వేల కోట్లతో ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన 10 ఫిషింగ్ హర్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మించారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. తీరప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ లేక ఒక ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టారు.
ఎయిర్పోర్టుల నిర్మాణంలో, రాష్ట్రాభివృద్ధికి గ్రోత్ ఇంజిన్గా రూ.3,200 కోట్టతో శరవేగంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు జరుగుతున్నాయి.
ఇక విద్యా రంగంలో అయితే, విద్యా, స్కూళ్ళు, యూనిఫాం ఇలా అన్ని సంస్కరణల మీద సీఎం జగన్ పెట్టిన ఖర్చు -73 వేల కోట్లు. వీటి మార్పు మనం నాడు నేడు లో భాగంగా ప్రతి స్కూళ్ళోనూ చూస్తున్నాం కూడా.