ప్రశాంత్ కిశోర్ రాజకీయ నాయకుడు కాదు, రాజకీయ నాయకుడికి మార్కెటింగ్ ఏజెంట్ మాత్రమే, చదివింది హైదరాబాద్ లో ఇంజనీరింగ్, మొదట చేసిన పని ఐక్యరాజ్యసమితి లో పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్ గా.. తర్వాత ఇండియా కి వచ్చి 2011 లో ఎన్నికల స్ట్రాటెజిస్ట్ గా కొత్త వృత్తి చేపట్టాడు…
ఐకురాజ్యసమితి లో ఉన్నప్పుడు చేసిన పని వల్ల కాంపెయిన్ ల మీద అవగాహన ఉండటంతో ఆ అనుభవాన్ని రాజకీయాల్లో కాంపెయిన్ లకు వాడుకుని అంచెలంచెలుగా ఎదిగాడు, గెలిచే పార్టీ వైపే ఉంటూ I-Pac పేరుతో ఓ కంపెనీ ని మొదలు పెట్టాడు. ఎన్నికలు ఎలా గెలవాలో ప్రశాంత్ కిషోర్ డిసైడ్ చేయలేడు, ప్రచారానికి మాత్రమే తన సలహాలు పనికొస్తాయి.. ప్రత్యక్ష రాజకీయాల్లో అతని పనితనం అత్యంత పేలవం అని, బీహార్ రాజకీయాల్లో తను JD(U) లో జాయిన్ అయ్యి, పార్టీ ఉపాధ్యక్షుడు అవ్వడం, సూరజ్ యాత్ర పేరుతో చేసిన అట్టర్ ప్లాప్ యాత్ర విఫలం, జేడీయూ లో ముసలం తదితర అంశాలు అతని ప్రత్యక్ష రాజకీయాల వైఫల్యాన్ని తేల్చేశాయ్…
2021 లో స్ట్రాటెజిస్ట్ గా రిటైర్ అవుతున్నాను అని ప్రకటించాక ఏ పార్టీ కి కూడా ప్రచారం చేయలేదు. అంతకుముందే I-Pac తో సంబంధాలు పూర్తిగా తెంపుకున్నాడు, అంటే ప్రస్తుతం తన దగ్గర ఎలాంటి సొంత టీమ్ లేదు, ఏ సర్వే సంస్థతో తనకి సంబంధమూ లేదు. కానీ మొన్నామధ్య బాబు తో భేటీ అయ్యి టీడీపీ కి పని చేయను అని చెప్పిన పీకే ఇవాళ అకస్మాత్తుగా వైసీపీ గెలవదు అని హైదరాబాద్ కి వచ్చి మరీ చెప్పాల్సిన అవసరం దేనికి వచ్చింది? తనకు సర్వే చేసి చెప్పిన సంస్థ ఏమిటి? టీమే లేని పీకే కి సర్వే చేసే కెపాసిటి ఎంత?
వీటన్నిటికీ సమాధానం: 2019 ఎన్నికల తర్వాత రెండేళ్లకి కూడా జాతీయ స్థాయిలో ప్రతిపక్షం లో నాయకత్వ లోపం కొట్టచ్చినట్లు కనపడింది, 2021 నుండి స్ట్రాటెజిస్ట్ గా మానేస్తున్నా అని చెప్పి జాతీయ మీడియా లో తరచూ కనపడుతూ, ప్రతిపక్షాల వైఫల్యాలను ఎండగట్టడం, ఎన్నికలకి వారు సిద్ధంగా లేకపోవడాన్ని ఎత్తి చూపడం, ప్రతిపక్షాల బద్దకాన్ని బయట పెట్టడం లాంటి కార్యక్రమాలు చేస్తూ, బీజేపీ ని ఓడించాలంటే ఎలాంటి స్ట్రాటజీ ఉండాలో, బీజేపీ బలం ఏంటో, బలహీనతలు ఏమిటో సూచాయగా మాట్లాడుతూ కనపడుతూ ఉన్నాడు.. దీనికి అంతటికి ఒక పెద్ద రహస్య ఎజెండా ఉంది. అదేమిటి అంటే బిజెపి కి ఎదురుగా నిలబడే సత్తా తనకి ఒక్కడికే ఉందని దేశం మొత్తాన్ని నమ్మించడం, త్వరలో ప్రతిపక్షానికి నాయకుడు అవ్వడం. అందులో భాగం గానే జేడీయూ లో జాయిన్ అవ్వడం ఒక పెద్ద ఎత్తు, జేడీయూ అధ్యక్షుడు అయిన నితీష్ కి వారసులు లేరు, పార్టీ లో తనకి జాయిన్ అవడం తోనే నంబర్ 2 ప్లేస్ వచ్చింది. సూరజ్ యాత్ర పేరుతో బిహార్ మొత్తం తన వెనుక నిలబడుతుంది అని బలంగా నమ్మాడు, కానీ సూరజ్ యాత్ర ఫెయిల్ అవ్వడం, నితీష్ బీజేపీ కి దగ్గరవ్వడం తో తన ఎత్తు పారకుండా పోయింది…
ఇప్పుడు నితీష్ లాంటి మరో ఊసరవెల్లి ఎవరున్నారు అని వెతుక్కుంటే బాబు రూపంలో తనకో లాటరీ తగిలింది, అందుకే నితీష్ బిజెపి లో జాయిన్ అవ్వక ముందు టీడీపీ కి పనిచేయడానికి నిరాకరించిన పీకే, నితీష్ బిజెపి లో జాయిన్ అవ్వగానే వైసీపీ ఓడిపోతుంది అంటూ టీడీపీ కి ఫేవర్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది బాబు కి దగ్గర అవ్వడంలో భాగం. నితీష్ ని వాడి దేశ రాజకీయాల్లో ప్రతిపక్షం యొక్క ముఖం కావాలనుకున్న పీకే, ఇప్పుడు బీజేపీ తో పొత్తుకు దూరం అయిన టీడీపీ ద్వార తన కార్యాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా అర్థం చేసుకోవచ్చు..
స్ట్రాటెజిస్ట్ లు ఎప్పటికీ నాయకులు కాలేరు, గుల్ల గుల్ల గా ఓడిపోయే వాళ్ళని ఎన్ని స్ట్రాటజీ లు వాడినా గెలిపించలేరు.. అలా గెలిచేదే ఉంటే వాళ్లు గెలుస్తారు వీళ్లు గెలుస్తారు అంటూ చెప్పుకు తిరగడం ఎందుకు తన సొంత రాష్ట్రంలో తనని తానే గెలిపించుకోవచ్చు కదా…