మొదటి నుండి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వాళ్ల రాష్ట్రం దివాలా తీసింది, శ్రీలంక, వెనుజులా అవుతుంది అని చేసిన ప్రచారం ఫలించకపోవడంతో ఈ మధ్య స్వరం మార్చి టీడీపీ, జనసేన వారు మేమొస్తే పథకాలు తీసెయ్యం, ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తాం అంటూ, మరి తమకెందుకు ఓటెయ్యడం జగన్ ఉంటే సరిపోతుందిగా అన్న ప్రజల వాదనకు బదులుగా రాష్ట్రం అభివృద్ధి చెందటం లేదు. మెమొస్తే అభివృద్ధి చేస్తాం.. జగన్ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాడు అంటూ ప్రచారానికి దిగారు…
అయితే రాష్ట్రం లో అభివృద్ధి జరగడం లేదని వారు నిర్మయించడానికి ఏ ప్రమాణాలను దృష్టిలో పెట్టుకున్నారో తెలియదు గానీ.. వాటిని ప్రజలకు వివరించాల్సిన అవసరం మాత్రం ఉంది…
అయితే అసలు అభివృద్ధి అంటే ఏమిటి? జగన్ విఫలం అయ్యాడా?
ఒకదేశంలో, లేదా ఒక రాష్ట్రంలో, లేదా ఒక ప్రాంతంలో అభివృద్ధి ఏమేరకు జరిగింది అని కొలవడానికి ఆర్థికవేత్తలు గత వందేళ్లుగా ఏదో ఒక ప్రతిపాదిక ప్రతిపాదించి పలానా దేశం అభివృద్ధి చెందింది, పలానా దేశం వెనుకబడింది అని లెక్కలు గట్టేవి… వాటన్నిటినీ ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తు ప్రస్తుతం అభివృద్ధికి ఒక మెరుగైన సూచీగా Human Development Index (HDI) ని రూపొందించారు…
1990 నుండి ఈ సూచీ ఆధారంగా UNO వారు HDI ర్యాంక్ లను వెల్లడిస్తుంది…
ఈ సూచీలో 3 అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు…
1.ఆయుప్రమాణం
2.విద్యాస్థాయి/ విజ్ఞానం
3.జీవన ప్రమాణం
ఆయుప్రమాణం:
2018 లో ఆంధ్రప్రదేశ్ సగటు ఆయుప్రమాణం 68.7, కోవిడ్ సమయం లో దేశం మొత్తం సంభవించిన మరణాల దృష్ట్యా దాదాపు అన్ని రాష్ట్రాల సగటు ఆయుప్రమాణం తగ్గింది (మొత్తం జనాభా సగటు తీసుకుంటారు కాబట్టి) కానీ ఆంధ్రప్రదేశ్ ఆయుప్రమాణం మాత్రం అనూహ్యంగా పెరిగింది 2022 లెక్కల ప్రకారం అది 70.3 అయింది…
కోవిడ్ సమయం లో జగన్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వల్ల, క్వారంటైన్ సెంటర్లు, హాస్పిటల్స్ లో అదనపు పడకలు, డాక్టర్ల అందుబాటు, ఉచితంగా మందులు, భోజన ఏర్పాటు మొదలైన చర్యలన్నీ మరణాల రేటు ను తగ్గించగలిగింది, ఇక సాధారణ స్థితిలో కూడా, ఆరోగ్య రంగం మీద పెట్టిన శ్రద్ధ కావొచ్చు, ఆరోగ్య శ్రీ లో ఖర్చు వెయ్యిదాటిన అన్ని అనారోగ్యాలను చేర్చడం కావొచ్చు ఏదైనా అవ్వచ్చు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది అనేది లెక్కలు చెప్తున్న వాస్తవం….
కాబట్టి ఈ సూచీ మెరుగైందని నివేదికల బట్టి తెలుస్తుంది…
విద్యాస్థాయి/విజ్ఞానం:
దీనిలో మొదటిది: వయోజనుల అక్షరాస్యత అనగా 15 ఏళ్లు దాటిన జనాభా మొత్తం యొక్క అక్షరాస్యత ఎంత ఉంది అనేది శాతం గా లెక్క వేస్తారు ఈ మధ్య ఈ లెక్కలు వేసింది లేదు.. కాబట్టి దీని గురించి అధికారిక లెక్కలు అందుబాటులో లేవు కాబట్టి మాట్లాడలేం..
రెండోది: స్థూల నమోదు నిష్పత్తి- అంటే ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యలలో ఎంతమంది నమోదు చేసుకుంటున్నారు అనే నిష్పత్తి ని లెక్కగడతారు…
2018-19 లో పాఠశాల స్థూల నమోదు నిష్పత్తి దేశ సగటు 99.21 ఉండగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అది 84.48 మాత్రమే ఉంది… అది 2023 నాటికి 100% కి చేరింది… అని అధికారిక లెక్కలు చెప్తున్నాయి… అంటే ప్రస్తుతం బడి వయసు ఉన్న పిల్లలు ఎవరూ బడికి వెళ్లకుండా లేరు ఈ రాష్ట్రం లో, బాబు హయాంలో 100 మందిలో 16 మంది బడి మొహం చూడలేదు అని అర్థం…
ఇక ఉన్నత విద్య విషయానికి వస్తే
All India survey of Higher Education report ప్రకారం ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి దేశ సగటు 3.04% అయితే ఆంధ్ర ప్రదేశ్ ది మాత్రం 8.6% గా నమోదు అయింది… దేశ సగటుకు రెండు రెట్లకి పైగా…..
కాబట్టి ఈ సూచీలో కూడా పెరిగింది అని అర్థం…
జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన నాటి నుండే విద్య మీద తన దృష్టినంతటినీ కేంద్రీకరించాడు… నాడు-నేడు, అమ్మఒడి, ఫీజురీయింబర్సుమెంటు పూర్తిగా ఇవ్వడానికి విద్యాదీవేన, హాస్టల్ ఫీజుకోసం వసతి దీవెన, ఇక మీకు తెలుసు ఏమేమి చేశాడు అనేది… వీటన్నిటి ద్వారా పైన చెప్పిన ఫలితం వచ్చింది…
జీవన ప్రమాణం:
దీన్ని లెక్కించడానికి తలసరి ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు…
తలసరి ఆదాయం అనగా రాష్ట్రం మొత్తం ఆదాయాన్ని ఆ రాష్ట్ర జనాభాతో భాగిస్తే వచ్చే సంఖ్య…
2019 లో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం దేశంలోని వివిధ రాష్ట్రాలతో పోల్చి చూస్తే రాష్ట్రం 19 వ స్థానంలో ఉంది… 2023 కి ఏకంగా 13 స్థానాలు ఎగబాకి 6 వ స్థానానికి చేరింది….
జీఎస్డీపీ అంటే ఒక రాష్ట్రం మొత్తం ఆదాయం…
2018 లో జీఎస్డీపీ ర్యాంకింగ్ లో ఏపీ 22 వ స్థానంలో ఉంటే 2022-23 ఆర్ధిక సంవత్సరానికి అది 14 వ స్థానానికి ఎగబాకింది..
అంటే 2018 లో మనకన్నా 21 రాష్ట్రాల ఆదాయం ఎక్కువ ఉంటే, అది 2023 కి 8 రాష్ట్రాలను దాటుకుని వచ్చి 14 వ స్థానంలో నిల్చుంది….
2018-19 లో 8.73 లక్షల కోట్లు గా ఉన్న ఆంధ్రప్రదేశ్ GSDP 2022-23 నాటికి 13.17 లక్షల కోట్లకు అంటే 5 ఏళ్లలో దాదాపు 50% పెరిగింది…
ఇవన్నీ అధికారిక లెక్కలే….
మరి ఐక్యరాజ్యసమితి వాళ్లే అభివృద్ధి అంటే ఏమిటి అని ఇచ్చిన నిర్వచనం ప్రకారమే గత ఐదేళ్లలో రాష్ట్రం అనూహ్యంగా అభివృద్ధి చెందినట్లు గా కనిపిస్తుంది కదా.. ఇది గుడ్డి వాడు కూడా చూడగలిగే అభివృద్ధి కదా…
మరి ప్రతిపక్షాలు ఏ అంశాలను ఆధారంగా చేసుకుని అభివృద్ధి జరగలేదని వాదిస్తున్నాయి?
మౌలిక సదుపాయాల విషయం అంటారా? గత 4.5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం లో వేసిన రోడ్లు, కట్టిన ఫ్లైఓవర్లు బాబు హయాం కన్నా ఎక్కువే కదా?
ఉత్తుత్తి MOU లు కాకుండా గ్రౌండ్ అయిన పెట్టుబడులు బాబు హయాం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ కదా? మరి ఇక అభివృద్ధి జరగనిది ఎక్కడ?