కాలానికి అనుగుణంగా వస్తున్న మార్పుల దృష్ట్యా ప్రజలు దర్జీ దగ్గరికి వెళ్ళి బట్టలు కుట్టించుకోడమే మానేశారు, గతం లో ఒక వెలుగు వెలసిన దర్జీలు నేడు పూటకి నోచుకోవడానికి కూడా కష్ట పడాల్సిన పరిస్థితి. నేడు రెడీ మెడ్ దుస్తులు లభించడం, అనుకున్నదే తడవుగా కొనుక్కునే పరిస్థితి.దానికి అనుగుణంగా వివిధ రకాల బ్రాండెడ్ దుస్తులు అందుబాటులోకి రావడం , గార్మెంట్స్ పరిశ్రమలు పెరగడం ఇలా ఒకో దానికి ఒక కారణం లాగా చెప్పొచ్చు. ఇల్లు గడవడమే కష్టమైన తరుణంలో, ఒక వేళ బట్టలు కుట్టిన ఆ డబ్బు కరెంట్ బిల్లులకు సరిపోని పరిస్థితి. నేటి తరం వాళ్ళు అంటే ఏదో ఒక పని చేసుకునే వెసులుబాటు ఉంది 30 నుంచి 40 ఏళ్ళ దాకా ఇదే వృత్తిని నమ్ముకున్న వారికి చాలా సహాయంగా నిలుస్తుంది జగనన్న చేదోడు పధకం .
2019లో ముఖ్యమంత్రి అయిన జగన్ మోహన్ రెడ్డి గారు దర్జీలకు జగనన్న చేదోడు అని పథకం పెట్టి వారికి ఏడాదికి రూ.10000 సహాయం చేస్తూ కొంత మేర ఆర్థికంగా సహాయపడుతున్నారు. దర్జిలకు చంద్రబాబు ప్రభుత్వం లో చూస్తే కనుచూపు మేర సహాయం కనిపించేది కాదు, అసలు ఇలాంటి పథకాలు ఇవ్వాలని ఏనాడు ప్రయత్నించిన పాపాన పోలేదు. ప్రతి ఏటా సెప్టెంబర్ , అక్టోబర్ మాసాలలో ఒక నోటిఫికేషన్ వదిలి దాని ద్వారా గ్రామ ,వార్డు సచివాలయలలో అప్లై చేస్కుంటే అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ సహాయం అందుతుంది. కరోనా సమయంలో పని లేక ఎటువంటి అసరా దొరకనప్పుడు ఈ వృతిన్ని నమ్ముకున్న వారికి ఈ పధకం బాగా ఉపయోగపడింది . ప్రతి ఏటా 2 లక్షల మంది అప్లై చేస్కుంటున్న తరుణంలో ప్రతి యేడు 200 కోట్ల వ్యయంతో అయిదు సంవత్సరాలకు గాను 1000 కోట్లు సహాయం చేసింది ప్రభుత్వం.