శ్రీకాకుళంలో గతంలో ఎప్పుడూ కూడా జరగనివిధంగా, గతంలో ఎప్పుడూ చూడనివిధంగా ఏకంగా రూ.4,400 కోట్లతో మూలపేట దగ్గర పోర్టు వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతున్నాయంటే కారణం మీబిడ్డ కాదా అని అడుగుతున్నాడు.
ఉద్దానం ప్రజల నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామని సీఎం జగన్ వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చాపురం సభలో ప్రసంగించిన జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే… ఆయన మాటల్లోనే..
శ్రీకాకుళంలో గతంలో ఎప్పుడూ కూడా జరగనివిధంగా, గతంలో ఎప్పుడూ చూడనివిధంగా ఏకంగా రూ.4,400 కోట్లతో మూలపేట దగ్గర పోర్టు వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతున్నాయంటే కారణం మీబిడ్డ కాదా అని అడుగుతున్నాడు. ఇదే శ్రీకాకుళంలోనే బుడగట్లపాలెం మంచినీళ్లపేటలో 2 ఫిషింగ్ హార్బర్లు వస్తున్నాయి. పూడిమడకలో ఉత్తరాంధ్రలో మరో ఫిషింగ్ హార్బర్ వస్తోంది, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు నిర్మిస్తున్నాం, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉరుకులు పరుగులతో వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతూ కనిపిస్తున్నాయి. భోగాపురం నుంచి విశాఖపట్నం, విశాఖపట్నం నుంచి భోగాపురానికి పోయేందుకు ఆరు లైన్ల రహదారిని కూడా నిర్మించబోతోంది మీ బిడ్డ పాలనలోనే. అదానీ డేటా సెంటర్, ఇన్ఫోసిస్ మొదలైంది కూడా మనందరి ప్రభుత్వంలోనే. దశాబ్ధాలుగా ఉన్న సమస్య మీ అందరికీ కూడా తెలిసిన సమస్యే ఉద్దానం సమస్య. దశాబ్ధాలుగా ఉంది ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఒక్కరంటే ఒక్కరూ ఆ సమస్య పరిష్కారానికి కృషి చేసిన పుణ్యం కట్టుకోలేదు. ఉద్దానం సమస్యను పరిష్కరించింది ఏకంగా రూ.780 కోట్లు ఖర్చు చేసి హిరమండలం నుంచి సర్ఫేజ్ వాటర్ తీసుకొచ్చి ఉద్దానం ప్రాంతంలోని ఈ ప్రాంతానికి అంతా కూడా నీళ్లు తేవాలి, ఇవ్వాలి, చేయాలి అని దానికి ఫౌండేషన్ వేసింది, పూర్తి చేసింది మీబిడ్డ కాదా అని అడుగుతున్నాడు.
ఏకంగా రూ.80 కోట్లతో కిడ్నీ ఆస్పత్రి రీసెర్చ్ సెంటర్ కు కూడా పునాది వేసింది, ఆ ప్రాజెక్టును కూడా పూర్తి చేసింది కూడా మీబిడ్డ కాదా అని ఈ సందర్భంగా అడుగుతున్నాడు . కొత్తగా ఉత్తరాంధ్రలో ఈ 59 నెలలకాలంలో 4 మెడికల్ కాలేజీలు కడుతున్నాం. ఈ 4 మెడికల్ కాలేజీల్లో 3 పార్వతీపురం, పాడేరు, నర్సీపట్నంలో గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నాయి. నాలుగోది మన విజయనగరంలో మెడికల్ కాలేజ్ వస్తోంది. మొట్టమొదటిసారిగా జేఎన్టీయూ విజయనగరంలో యూనివర్శిటీని చేసింది మనందరి ప్రభుత్వమే. సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నది మన ప్రభుత్వమే. కురుపాంలో ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజ్ కడుతోంది కూడా మన ప్రభుత్వమే. ఐటీడీఏల పరిధిలో ఏకంగా 5 మల్టీ స్పెషాలిటీ ఈరోజు వేగంగా పనులు జరుగుతున్నాయంటే ఇది మీబిడ్డ పాలనలో కాదా అని మీ బిడ్డ అడుగుతున్నాడు. మారుమూల ఉండిపోయిన గిరిజన ప్రాంతాల్లో సెల్ఫోన్లు కూడా లేని పరిస్థితి, సెల్ఫోన్ కనెక్టివిటీ కూడా లేనిచోట ఏకంగా 400 టవర్లు రూ.400 కోట్ల వ్యయం చేసి ఈరోజు ఎవ్వరూ పోనీ ఆ గిరిజన ప్రాంతాలకు సెల్ఫోన్ల ద్వారా కనెక్టివిటీ కూడా ఇచ్చింది ఈ 59 నెలలకాలంలోనే అని గర్వంగా చెబుతున్నానని సీఎం జగన్ పేర్కొన్నారు.