ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, మహా న్యూస్ తదితరాలు తాము ప్రజల పక్షమని నిత్యం కబుర్లు చెబుతుంటాయి. కానీ వారంతా సేవ చేసేది తెలుగుదేశానికి మాత్రమే. ఈ విషయం జగమెరిగిన సత్యం. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ పార్టీ నేతలపై బురద వేయడం, టీడీపీ నేతల అక్రమాలను దాచిపెట్టి వారిని మహోన్నతులుగా చిత్రీకరించడం పచ్చ మీడియా రోజువారి టాస్క్. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులపై అబద్ధాలను ప్రచారం చేసేందుకు టీడీపీ, ఎల్లో మీడియా సభ్యులు నిత్యం కలిసి కుట్రలు చేస్తున్నారు.
తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థులు నేరుగా వెళ్లి ఎల్లో మీడియాను కలవడమో.. లేక వారే అభ్యర్థుల వద్దకు పోయి సమావేశాలు పెట్టడమో జరుగుతోంది. ఒకప్పుడు చాటుమాటుగా సాగిన వ్యవహారాన్ని నేడు బహిర్గతం చేసేశారు. చంద్రబాబు అడపాదడపా రామోజీరావు, రాధాకృష్ణ తదితరులను కలిసి గంటలు గంటలు చర్చిస్తున్నారు. ప్రత్యర్థులపై ఏం అబద్ధాలు రాయాలి.. ప్రజలకు ఏం తప్పుడు సమాచారం చూపించాలి.. తదితర విషయాలపై సూచనలిస్తున్నారు. ఇక జిల్లాల్లోనూ కోఆర్డినేషన్ మీటింగ్లు జరుగుతున్నాయి. విందుల పేరుతో సమావేశాలు పెట్టి ప్రణాళికలు వేసుకుంటున్నారు. తాజాగా టీవీ5 చైర్మన్ బీఆర్ నాయుడు విజయవాడ టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని)ను పార్టీ కార్యాలయంలో కలిశారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి కేశినేని నానిపై ఏ అంశాల్లో దుష్ప్రచారం చేయాలో చర్చించినట్లు తెలిసింది.
ఎల్లో మీడియాకు ఆర్థిక వనరులు సమకూరుస్తోంది చంద్రబాబే. అధికారంలో ఉన్నప్పుడు వారికి వేల కోట్ల రూపాయలు దోచిపెట్టాడు. నియోజకవర్గాల్లో పచ్చ గ్యాంగ్ను పెంచి పోషిస్తోంది టీడీపీ నాయకులే. వీళ్లు పైకి ప్రజలను ఉద్ధరిస్తున్నామని చెబుతున్నా.. అంతిమంగా కావాల్సింది పదవి మాత్రమే. దాని కోసం ఎంతకైనా దిగజారుతారు.