మీడియాలో ముందు నిత్యం నీతులు వల్లించే టీవీ5 సాంబశివరావుకి చుక్కెదురైంది. పెట్రోల్ బంక్ స్వాధీనంతో అతను చేసిన మోసం బట్టబయలైంది. కొన్నేళ్ల క్రితం ఫోర్జరీ డాక్యుమెంట్లతో టీవీ5 సాంబశివరావు పెట్రోల్ బంక్ పొందారని సంధ్యా గ్రూప్ ప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో అతనిపై కేసు నమోదు అయింది. అయితే అనేక విచారణలు, వాదోపవాదాలు అనంతరం ఎట్టకేలకు అతను మోసం బట్టబయలైంది. సంధ్య గ్రూప్ కి సాంబశివరావు చేసిన వంచన సాక్ష్యాధారాలతో సహా నిరూపించబడింది.
ఈ నేపథ్యంలోనే టీవీ 5 వైస్ ప్రెసిడెంట్ సాంబశివరావుకు హెచ్ పీ సీ ఎల్ యాజమాన్యం ఊహించని షాక్ ఇచ్చింది. సాంబశివరావు కు చెందిన పెట్రోల్ బంక్ పై చట్టబద్ధమైన చర్యలకు హెచ్పీసీఎల్ చర్యలకు దిగింది. ఫోర్జరీ డాక్యుమెంట్లతో టీవీ5 సాంబశివరావు పొందిన పెట్రోల్ బంకును మంగళవారం స్వాధీనం చేసుకుంది. తనకు తెలియకుండా ఫోర్జరీ డాక్యుమెంట్లతో పెట్రోల్ బంక్ నడుపు తున్నారని సంధ్యా గ్రూపు ఎండీ శ్రీధర్రావు హెచ్పీసీఎల్ కు చేసిన ఫిర్యాదుతో సాంబశివరావు ఉదంతం అంతా బయటపడింది.
దీంతో సాంబశివరావు, ఆయన కుటుంబ సభ్యులపైన మాదాపూర్ పీఎస్ లో ఫోర్జరీ కేసు నమోదైంది. ఈ క్రమంలోనే హెచ్పీసీఎల్ అధికారులు గతంలో పెట్రోల్ బంక్ లోని కొంత భాగాన్ని సీజ్ చేసిన విషయం తెలిసిందే.. అయితే తాజాగా హెచ్ పీ సీ ఎల్ అధికారులు ఫోర్జరీ డాక్యుమెంట్లతో టీవీ5 సాంబశివరావు అక్రమంగా పొందిన ఆక్రమిత పెట్రోల్ బంకును పూర్తిగా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే స్వాధీనం చేసుకున్న పెట్రోల్ బంక్ ని కూల్చివేసి అప్పగించాల్సి ఉందని సంధ్యా గ్రూపు ప్రతినిధులు తెలిపారు.