గిరిజనుల ఆవాస ప్రాంతాలలో , పర్యాటకానికి అనువైన ప్రదేశాలలో ఆంధ్ర ప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) చాలా ఏళ్ళ కిందటే ఏపీటీడీసీ హోటళ్ళు, రెస్టారెంట్ లు నిర్మించింది. ఇప్పుడు ఆ హోటళ్ళు నిర్వహించుకోవడానికి ప్రైవేట్ వారికి టెండర్లుకు ఆహ్వానించింది. రాష్ట్రం లో ఎక్కడైనా జరిగే విధానం ఇదే. కానీ ప్రస్తుతO ఈ టెండర్ విషయం లో ఈనాడు ప్రభుత్వం పైన బురద చల్లడానికి అసహనం వ్యక్తం చేస్తూ వార్త రాసింది.
టెండర్లుకు ఆహ్వానించిన హోటళ్ళు కింద ఏపీటీడీసీ క్లస్టర్ 1 పరిధిలో అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని అనంతగిరి, అరకు వ్యాలీ, లంబసింగి, బైడా , విశాఖ లోని హోటళ్ళు ఆపరేషన్ , నిర్వహణలో భాగంగా టెండర్లు కు పిలిచారు. ఇక్కడ విశాఖ లో మినహా మిగిలిన హోటళ్ళు అన్ని గిరిజన ప్రాంతాలలో ఉన్నాయి. ఇతరులకు అప్పగించాలి అంటే వాటిని స్థానిక గిరిజనులు పర్మిషన్ తీసుకోవాలి అని వార్త రాశారు. ఆల్రెడీ ఆ హోటళ్లు నిర్వహణ ఏపీటీడిసి ఆధ్వర్యంలో ఉన్నపుడు వారిని అడగాల్సిన పని లేదు.
గిరిజన ప్రాంతాలలో గ్రామ సభలో నిర్వహించి వాళ్ళ ఆమోదం ఎప్పుడు తీసుకోవాలి అంటే కొత్తగా ఆ ప్రదేశాలలో ఏమైనా నిర్మించదలిచిన లేదా ప్రైవేట్ వ్యక్తులు కు ఎప్పుడైనా లీజ్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే నిర్వహిస్తారు. ఇక్కడ ఇచ్చిన లీజ్ పద్దతిలోనే ఇస్తారు గానీ శాశ్వతంగా ఇచ్చే పరిస్థితి ఇక్కడ ఉండదు. కానీ ఈనాడు మాత్రం ప్రభుత్వం పై విషం చిమ్మడానికి, స్థానిక గిరిజనులలో ఆందోళన సృష్టించడానికి ఇలాంటి వార్తలు రాస్తున్నారు.