ఆటోమొబైల్, ఐటీ, ఐటీ ఈఎస్ తయారీ, రిటైట్ ఫార్మా, అగ్రి – ఆక్వా లాజిస్టిక్స్, ఎలక్ట్రికల్ – ఎలక్ట్రానిన్స్, టెక్స్టైల్స్, ఆయిల్ అండ్ పెట్రోలియం రంగాల్లో యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా పరిశ్రమల ప్రాంగణాల్లోనే స్కిల్ స్పోక్స్ కేంద్రాలను నెలకొల్పారు.
పరిశ్రమల్లో పనిచేసేందుకు నైపుణ్యం కలిగిన వారిని అందించేందుకు స్కిల్ స్పోక్స్ నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇవి ఫలితాలను ఇస్తున్నాయి. మొత్తం పది రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒప్పందాలను కుదుర్చుకుంది. వాటిలో ఫార్మా రంగంలో డాక్టర్ రెడ్డీస్, రాంకీ, అరబిందో, హెటిరో, వసుధ, జేఎన్యూ ఫార్మా, టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్ రంగంలో ఆలస్టోమ్, డైకిన్, ఫాక్స్కాన్, పానాసోనిక్, డిక్సన్, ఆటోమొబైల్ రంగంలో కియా, హ్యుందాయ్, మోబిస్, వరుణ్ మోటార్స్, జయభేరి ఆటోమోటివ్, యకహోమా, తయారీ రంగంలో జేఎస్డబ్ల్యూ, ఆల్ట్రాటెక్ తదితర కంపెనీలున్నాయి. ఇందులో భాగంగా 16,540 మంది శిక్షణ పొందితే 15,707 మందికి ఉద్యోగాలు లభించాయి. వచ్చే మూడు నెలల్లో నాలుగు వేలమందికి పైగా శిక్షణ ఇవ్వాలని సంబంధిత అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది. గతంలో స్కిల్ డెవలప్మెంట్ పేరుతో చంద్రబాబు నాయుడి ప్రభుత్వం మోసం చేయగా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రం పారదర్శకంగా వ్యవహరిస్తోంది.