ఈ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి. అధికార వైసీపీ అభ్యర్ధులను ప్రకటించుకుంటూ అప్రతిహతంగా ఎన్నికల ప్రచారంలో జోరు చూపిస్తుంది. అయితే విపక్షాలైన టీడీపీ, జనసేన మాత్రం పొత్తులతో మల్లగుల్లాలు పడుతూ.. కొన్ని సీట్లు ప్రకటించి, ఆ సీట్లలో కూడా పలు వివాదాలు రేగుతుండగా వాటాని సద్థుమణిగించడానికి ప్రయత్నిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మళ్లీ బీజేపీతో పొత్తు అంటూ… కొత్త పొత్తు స్నేహానికి తెరతీసి… అక్కడా సీట్లు సర్దుబాటు తేలకపోవడౌతో అయోమయ స్థితిలో పడ్డాయి. అదే సమయంలో దాదాపు అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ అధినేత ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుటానికి సిద్ధం సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పుటి వరకూ మూడు సభలు జరగగా… మూడూ వేటికవే విజయవంతం అయ్యాయి.
మూడో సిద్ధం సభ అనంతపురంలో నిర్వహించగా… రికార్డు స్థాయిలో దాదాపు 12,00,000 మంది జనం హాజరయ్యారు. తండోపతండాలుగా సిద్ధం సభలకు వస్తున్న జనాన్ని చూసి తెదేపా కూటమికి గుండెల్లో రాయి పడినంత పనవుతూ ఉంది. అధికార పక్ష జగన్ ప్రజా బలం ఏంటో అనంతపురం సిద్ధం సభ చాటిచెప్పింది.
కాగా, ఈరోజు జరిగే నాలుగో సిద్ధం సభలో వైసీపి మేనిఫెస్టో కూడా ప్రకటించనుందని వార్తలు వస్తున్నాయి. ప్రజాకర్షక పధకాలు, పాలనా అందిస్తున్న జగన్ రాబోయే ఎన్నికల కోసం ఎటువంటి ఆకర్షణీయ పధకాలను, అభివృద్ధిని చేపట్టనున్నారో అని జనం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో నేటి సిధ్ధం మొదటి మూడు సభల కన్నా మరింత విజయవంతం అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.