జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు 2024 సార్వత్రిక ఎన్నికలుకు సంబంధించి పిఠాపురంలో ఈరోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు కూటమి నాయకులు ఇప్పటికే చేశారు. తెలుగుదేశం పార్టీ నియోజక వర్గ ఇంఛార్జి ఎస్వీ యస్ యన్ వర్మ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతున్నట్లు సమాచారం . పవన్ కళ్యాణ్ నామినేషన్ ర్యాలీ ఈ విధంగా ఉండబోతుంది . ఈ రోజు ఉదయం 9.30 లకు గొల్లప్రోలు వై జంక్షన్ నుంచి ర్యాలీ ప్రారంభం అవుతుందని నాయకులు తెలిపారు. గొల్లప్రోలు తహశీల్దార్ కార్యాలయం కూడలి, సూరీడు చెరువు, పిఠాపురం దూళ్ళ సంత, చర్చ్ సెంటర్, పిఠాపురం బస్టాండ్, ఉప్పాడ బస్టాండ్, గవర్నమెంట్ హాస్పిటల్, పోలీస్ స్టేషన్ రోడ్ మీదుగా ర్యాలీ సాగుతుందని తెలిపారు.
ప్రతి గ్రామం నుంచి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలి రావాలని వర్మ పిలుపునిచ్చారు. ర్యాలీకి వచ్చిన వారందరూ గొల్లప్రోలు వై జంక్షన్ వద్ద వేచి ఉండాలని తెలిపారు. అక్కడ నుంచి ర్యాలీ ప్రారంభించుకొని తహసీల్దార్ ఆఫీస్ కి వెళ్ళే సమయంలో ర్యాలీలో యువకులు జాగ్రత్తలు వహించాలి అని సూచనలు తెలిపారు. పవన్ కళ్యాణ్ నామినేషన్ కి 25 వేల మందికి పైగా కూటమి కార్యకర్తల హాజరు అవుతారు అని అంచనా వేస్తున్నారు కానీ టీడీపీ కార్యకర్తలు వర్మ మాట వినే పరిస్థితి కనపడటంలేదని పబ్లిక్ టాక్