వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మౌలిక రంగ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్తుందని ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘ఆంధ్రప్రదేశ్లో మౌలిక రంగం అభివృద్ధి నాడు – నేడు’ అంశంపై బుధ వారం విజయవాడలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో విద్యావేత్తలు, మేధావులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. దక్షిణాదిలో మౌలిక వసతులపై అత్యధికంగా ఖర్చు చేస్తున్న రాష్ట్రం ఏపీ అని, దేశవ్యాప్తంగా రూ.70 లక్షల కోట్ల విలువైన మౌలిక రంగ నిర్మాణాలు జరుగుతుంటే, ఒక్క ఏపీలోనే 6.75 లక్షల కోట్ల పనులు జరుగుతున్నాయని సగటున దేశంలో 10 శాతం అభివృద్ధి ఏపీలోనే జరుగుతోందని వ్యాఖ్యానించారు.
గత నాలుగున్నరేళ్లుగా మౌలిక రంగంలో ఏపీ సాధిస్తున్న ప్రగతిని జాతీయ స్థాయి సంస్థలు సైతం ప్రశంసిస్తున్నాయి. పారిశ్రామిక రంగంలో 23.36 శాతం వృద్ధి రేటుతో 2022-23లో ఆంధ్ర ప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. నాలుగు ఎకనమిక్ కారిడార్లతో (ఈస్ట్ కోస్ట్, విశాఖ – చెన్నై, చెన్నై – బెంగళూరు, హైదరాబాద్ – బెంగళూరు) వాణిజ్యానికి కేంద్ర బిందువుగా రాష్ట్రం మారుతుంది. ఏపీ లో పోర్టుల ద్వారా 2 వేల రకాల ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ సాధిస్తున్న అభివృద్ధిని దాచిపెట్టి ఎల్లో మీడియా విష ప్రచారం చేయడం శోచనీయం. అసత్య కథనాలు ప్రచురించి పత్రికలను ఉచితంగా పంచినంత మాత్రాన ఎల్లో మీడియా వాస్తవాలను దాచిపెట్టలేదు. సీఎం జగన్ పేదలకు 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం ద్వారా రూ. 2 లక్షల కోట్లకుపైగా సంపద సృష్టించారు. ఇదే సుస్థిర పాలన కొనసాగితే మరో పదేళ్లలో ఏపీ సింగపూర్ గా మారుతుందని విద్యావేత్తలు, మేధావులు
ప్రశంసించారు.
గ్రామాల్లో మౌలిక వసతులు పెంచిన సీఎం జగన్
పట్టణాల్లో నాలుగు బిల్డింగులు కట్టేసి, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇస్తేనే అభివృద్ధి కాదు. ఏపీలో గ్రామీణ జనాభా ఎక్కువ. పాఠశాలలు, ఆస్పత్రులు, గ్రామ, వార్డు సచివాలయాల రూపంలో గ్రామాల్లోనే పెద్ద ఎత్తున మౌలిక వసతులను సీఎం జగన్ పెంచారు. గతంలో లేని విధంగా జగన్ పాలనలో ఏపీలో 4 పోర్టులు, 6 సెజ్ లు, 10 హార్బర్లు వచ్చాయి. 66 వేల కోట్లకుపైగా పెట్టుబడులతో 120 భారీ పరిశ్రమలు వచ్చాయి. మరో 3.85 లక్షల కోట్ల పెట్టుబడులతో 88 ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.
– వెంకట్ మేడపాటి ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ అధ్యక్షుడు
సంక్షేమం వృథా కాదు
ఏపీలో 2014-19 వరకు చీకటి పాలన నడిచింది. చంద్రబాబు అప్పులు, తప్పులను సరిదిద్దుతూ సీఎం జగన్ సంక్షేమ పాలన అందిస్తున్నారు. సామాజిక అభివృద్ధి లేకుండా ఆర్ధిక అభివృద్ధి సాధ్యపడదు. సంక్షేమం చేస్తే ప్రజాధనం వృథా కాదు.
– ఎన్. రాజశేఖర్ రెడ్డి, ఓపెన్ మైండ్స్ సంస్థ అధ్యక్షుడు
ఒక దేశానికి ఉండాల్సిన లక్ష ణాలు ఏపీకి ఉన్నాయి
సుదీర్ఘ తీర ప్రాంతం, పర్యా టకం, గనులు, మానవ వనరుల సామర్థ్యం ఇలా ఒక దేశానికి ఉండాల్సిన లక్షణాలు ఏపీకి ఉన్నాయి. దశాబ్దాల సుస్థిర పాలన నడిచింది కాబట్టే సింగపూర్ గొప్ప దేశంగా ఆవిర్భవించింది. సుస్థిర పాలన కొనసాగిస్తే ఇక్కడే సింగపూర్ను చూడొచ్చు. పేదలకు సంక్షేమ పథకాలు ఇస్తే సోమరిపోతులు అయిపోతారనడం సిగ్గుచేటు. 23 సార్లు ప్రధాన మంత్రిని కలిసి, రాష్ట్ర అభివృద్ధిపై చర్చించిన సీఎం జగన్ ఒక్కరే.
వీవీఆర్ కృష్ణంరాజు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
బలహీన వర్గాలకు ప్రైవేటు వర్సిటీల్లో విద్య చెప్పిస్తున్న ఏకైక ప్రభుత్వం
విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వడంతో పేదలపై ఆర్థిక భారం తగ్గిపోయింది. ఒక పిల్లాడిని బడికి పంపించడం ద్వారా ఆ కుటుంబం జీవితమే మారిపోతుంది. అందుకే ఏ ప్రభుత్వం చేయని విధంగా రూ.1.12 లక్షల కోట్లు విద్యపైనే ఖర్చు చేస్తూనే బలహీన వర్గాలకు ప్రైవేటు వర్సిటీల్లో విద్య చెప్పిస్తున్న ఏకైక ప్రభుత్వం జగన్ ప్రభుత్వం.
– ఇ.శ్రీనివాసరెడ్డి, ఆచార్య నాగార్జున వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్
ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ విద్య
సీఎం జగన్ పిల్లల భవిష్యత్తు కోసం అలోచించి ప్రభుత్వ పాఠశాలలలో అంతర్జాతీయ స్థాయి విద్యను ప్రవేశపెట్టారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే 1.30 లక్షలకు పైగా గ్రామ/వార్డు సచివాలయాల్లో శాశ్వత ఉద్యోగాలను కల్పించారు. ఇప్పటివరకు 2 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. కానీ చంద్రబాబు హయాంలో 13,700 ప్రభుత్వ ఉద్యో గాలు మాత్రమే ఇచ్చారన్న విషయాన్ని దాచిపెట్టిన ఎల్లో మీడియా ఉద్యోగాలు ఇవ్వట్లేదని గుండెలు బాదుకుంటుంది.
– మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బెటర్ ఏపీ సంస్థ అధ్యక్షుడు