బీజేపీ-జనసేనతో పొత్తు వలన టీడీపీ కి కొత్త చిక్కు వచ్చి పడింది. పార్టీ లో చాలా మందికి, టికెట్ ఇస్తే పక్కా ఓడిపోయే అవకాశం ఉన్న చోట టికెట్ మార్పు వలన, వైసీపీ నుండి తాలుని ఏరుకోవడం వలన వారికి తప్పనిసరి టికెట్ కేటాయించాల్సి రావడం వలన… టీడీపీ నే ఎప్పటి నుండో నమ్ముకున్న సీనియర్లకు బాబు మొండి చేయి చూపిస్తున్నాడు.. రాజకీయం గా వారు ఎన్నోయెల్ల నుండి పార్టీ కి సేవ చేస్తున్నారనే కనీస కృతజ్ఞత లేకుండా వారిపై నిర్దాక్షిణ్యంగా వేటు వేస్తున్నాడు..
ముందుగా బుచ్చయ్య చౌదరి కి వేటు వేయబోగా బుచ్చయ్య తన రాజకీయ చతురత మొత్తాన్ని వాడి తన స్థానాన్ని తాను దక్కించుకున్నాడు.. ఇదే విధంగా బోడే ప్రసాద్ కు టికెట్ నిరాకరిస్తే అతను నానా రచ్చ, యాగీ చేసి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని బెదిరించగా తప్పక తనకు పెనమలూరు టికెట్ కేటాయించాడు.. ఇక పార్టీ ని ప్రాణం అనుకునే దేవినేని ఉమకు ఊరించి ఊరించి చివరకు టికెట్ లేకుండా చేశాడు. 139 స్థానాలలో అభ్యర్థులను ప్రకటించినా పార్టీ లో సీనియర్ మోస్ట్ నాయకుల్లో ఒకరైన కిమిడి కళా వెంకట్రావు కు ఇంత వరకు సీట్ డిక్లేర్ చేయలేదు.. పొత్తులో భాగంగా ఆయన పోటీ చేసే ఎచ్చెర్ల ను బీజేపీ కి కేటాయించనున్నట్లు సమాచారం.. ఇలాగే పార్టీ ని నమ్ముకుని ఎన్నోయేళ్లుగా రాజకీయం చేస్తున్న బీకే పార్థసారథి పెనుగొండ నుండి సీటు నిరాకరణకు గురయ్యాడు.. ఇలా చెప్పుకుంటూ పోతే… గజపతి నగరం ఇంచార్జ్ అయిన కొండపల్లి అప్పలనాయుడు, అనకాపల్లి నుండి మాజీ ఎంఎల్సీ బుద్ధా నాగ జగదీష్, రాయచోటి ఇంచార్జ్ రమేష్ రెడ్డి తదితరులకు ఇప్పటికే టికెట్ లేదు పొమ్మని చెప్పడం జరిగింది…
ఇలా సీనియర్లను చాలా వరకు పక్కనబెట్టి, డబ్బున్న క్యాండిడేట్ లనే ఎన్నికల బరిలో దింపి, పక్కా గా ఓడిపోయే స్థానాలను మాత్రం బీజేపీ-జనసేనలకు కేటాయించిన బాబు, విడతల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తూ నానా తంటాలు పడుతున్నాడు.. ఇలా పొత్తు ప్రభావంతో పోటీ చేయబోయే సీట్లను ప్రకటించడానికే ప్రాణం పోయినంత కష్టపడ్డ బాబు ఇక రేపు ఎన్నికల సమరం లో ఎలా తట్టుకుంటాడో వేచి చూడాలి..