ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. 2019 ఎన్నికల్లో పది స్థానాలను క్లీన్స్వీప్ చేసింది. పార్లమెంట్ స్థానాల్లోనూ గెలిచింది. 24లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి (వీపీఆర్) టీడీపీలో చేరుతారంటూ ప్రచారం జరుగుతోంది. ఆయన చాలా పెద్ద నేత అని తెలుగు తమ్ముళ్లు సంబరపడిపోతున్నారు. వాస్తవానికి వీపీఆర్కు జనబలం లేదు. ఇన్నాళ్లు వైఎస్ జగన్మోహన్రెడ్డి బొమ్మే ఆయన బలం.
వేమిరెడ్డి బడా పారిశ్రామికవేత్త. నెల్లూరుకు చెందిన ఈయన చాలాకాలం ఇక్కడ లేరు. బయట ప్రాంతాల్లో ఉన్నారు. రాజకీయాలపై ఆశతో నగరానికి వచ్చారు. 2014 నుంచి వైఎస్సార్సీపీలో ఉన్నారు. అప్పట్లో రాజ్యసభ సీటు ఆశించారు. అయితే కొన్ని సమీకరణాల నేపథ్యంలో విజయసాయిరెడ్డికి జగన్ అవకాశం కల్పించారు. దీంతో వీపీఆర్ అలకపాన్పు ఎక్కారు. ఒకానొక సందర్భంలో తెలుగుదేశంలో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే మనసు మార్చుకుని వైఎస్సార్సీపీలో ఉండిపోయారు. 2018లో ఆయన్ను జగన్ పెద్దల సభకు పంపారు. 19లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక చాలా అంశాల్లో వీపీఆర్కు ప్రాధాన్యం దక్కింది. ఆయన భార్య ప్రశాంతిరెడ్డి టీటీడీ బోర్డు సభ్యురాలయ్యారు. నెల్లూరు జిల్లాలోనూ వేమిరెడ్డి పార్టీ పెద్దగా వ్యవహరించారు. కొత్త జిల్లా అధ్యక్ష బాధ్యతలను అధిష్టానం ఇచ్చింది.
24లో నెల్లూరు ఎంపీ సీటును జగన్ వేమిరెడ్డికి ఖరారు చేశారు. అయితే ఆయన నెల్లూరు సిటీ, కావలి, ఉదయగిరి అసెంబ్లీ అభ్యర్థులను మార్చాలని డిమాండ్ చేశారు. ఎవరిని ఎక్కడ నుంచి పోటీ చేయించాలి, అభ్యర్థుల మార్పును అధిష్టానం చూసుకుంటుంది. ఏ నియోజకవర్గంలో ఎవరు ఫిట్ అవుతారో లెక్కల్ని వేసుకుని సీట్లు ఇస్తుంది. ఏ పార్టీలో అయినా ఇలాగే జరుగుతుంది. ఈ క్రమంలో నరసారావుపేట ఎంపీ అభ్యర్థిగా బీసీని నిలబెట్టాలని నిర్ణయించిన అధిష్టానం నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ను అక్కడికి పంపింది. కాగా సిటీ సమన్వయకర్తగా ముస్లిం అయిన ఖలీల్ అహ్మద్కు అవకాశం ఇచ్చారు. దీంతో వేమిరెడ్డి తన మాట నెగ్గలేని పంతానికి పోయారు. భార్యకు సిటీ స్థానం ఇవ్వలేదని, ఇతర కారణాలతో వైఎస్సార్సీపీకి దూరమయ్యేందుకు నిర్ణయిచుకున్నారు. టీడీపీ దీనిని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. వీపీఆర్కు టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి దగ్గరి బంధుత్వం ఉంది. ప్రస్తుతం దీనిని వాడి వేమిరెడ్డిని తమ వైపు తిప్పుకొంటున్నారు. ధన బలం ఉన్న నేపథ్యంలో ఆయన చెప్పినట్లు చేస్తామని ఆఫర్ ఇచ్చారు.
ఇప్పటికే వీపీఆర్ చంద్రబాబుతో భేటీ అయ్యారని సమాచారం. ఈయనకు నెల్లూరు ఎంపీ, భార్యకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేందుకు అంగీకరించినట్లు ఇప్పటికైతే చెబుతున్నారు. వేమిరెడ్డి ఏనాడూ జనంలో లేరు. మాస్ లీడర్ కాదు. 2014 నుంచి వైఎస్సార్సీపీ నీడన ఉంటూ రాజకీయంగా ఎదిగారు. పార్టీ కూడా చాలా గౌరవించింది. ఇప్పుడు టీడీపీ మభ్యపెట్టి తీసుకుంటుంది. కానీ అక్కడ గౌరవం దక్కే పరిస్థితి లేదు.
ఉమ్మడి జిల్లా కావొచ్చు. కొత్త జిల్లా కావొచ్చు. నెల్లూరులో వైఎస్సార్సీపీ చాలా బలంగా ఉంది. జగన్ అంటే ప్రజల్లో విపరీతమైన అభిమానం ఉంది. అందుకే 2014లో పదిలో ఏడు స్థానాల్లో గెలిచింది. ఎంపీ స్థానాలు కైవశం చేసుకుంది. 2019లో అయితే పదింటిలోనూ గెలిపించింది. గత ఏడాది వెంకటగిరి, ఉదయగిరి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తమకు జగన్ టికెట్లు ఇవ్వరని తెలుసుని చంద్రబాబుకు అమ్ముడుపోయారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారు మోసం చేయడంతో వైఎస్సార్సీపీ అధిష్టానం సస్పెండ్ చేసింది. అయినా పార్టీ బలహీనపడలేదు. రూరల్కు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్రెడ్డిని, వెంకటగిరికి నేదురుమల్లి రామ్కుమార్రెడ్డిని, ఉదయగిరికి మేకపాటి రాజగోపాల్రెడ్డిని సమన్వయకర్తలుగా నియమించింది. ఇప్పుడు వీపీఆర్ బయటకు వెళ్లినా పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదు. నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యే కావొచ్చు.. అభ్యర్థులు కావొచ్చు.. చాలా బలంగా ఉన్నారు. జగన్ బొమ్మే వారిని గెలిపిస్తుంది. దీంతో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎవరైనా ఎంపీగా గెలవడం ఖాయం.
ఇప్పుడు చంద్రబాబు వీపీఆర్కు ఎంపీ టికెట్ ఇవ్వాలంటే ముస్లిం అయిన అబ్దుల్ అజీజ్కు వెన్నుపోటు పొడవాలి. ప్రశాంతిరెడ్డికి నెల్లూరు సిటీ, రూరల్ సీట్లు ఇవ్వలేడు. సర్వేపల్లిలో ఇచ్చేందుకు దగ్గరి బంధువైనా సోమిరెడ్డి అస్సలు ఒప్పుకోడు. ఈ మధ్య ఆంధ్రజ్యోతి సీట్ల ప్రకటనలో భాగంగా కోవూరును ఖాళీ పెట్టింది కానీ.. అక్కడ పోలంరెడ్డి దినేష్రెడ్డికి ఇవ్వకపోతే పార్టీ అస్తవ్యస్తమైపోతుంది. కావలిలో ఇన్చార్జి ఉన్నారు. దీంతో ఆమె ఆత్మకూరు, ఉదయగిరికి వెళ్లి పోటీ చేసే పరిస్థితి లేదు. దీనికితోడు జనసేనకు ఒక సీటు ఇవ్వాలి. ఆ పార్టీ నేతలు గట్టిగానే అడుగుతున్నారు. ఒకవేళ బీజేపీతో పొత్తు కుదిరితే అసెంబ్లీ సీటు లేదా నెల్లూరు ఎంపీ స్థానం అడిగే అవకాశముంది.
అత్యంత గౌరవంగా చూసుకుంటున్న వైఎస్సార్సీపీని వీడితే వేమిరెడ్డికే నష్టం. నాకు ధన బలం ఉందని అనుకుంటే ఆయనంత పిచ్చివాడు ఉండడు. జగన్ బొమ్మ లేకపోతే ఎవరూ పట్టించుకోరనే విషయం వీపీఆర్కు కూడా తెలుసు. చంద్రబాబు ఎవరొచ్చినా తీసుకుని కరివేపాకులా వాడేసి వదిలేస్తాడంతే. తీరా బలైపోయాక జగన్ విలువ వీపీఆర్కు అర్థమవుతుంది.