ప్రజల జ్ఞాపక శక్తి మీద నమ్మకం చాలా ఎక్కువ చంద్రబాబుకి . తాను చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు అమలు చేయకపోయినా కొన్నాళ్లకి ఎవరికి గుర్తు లేక కాలగర్భంలో కలిసిపోతాయని అపార నమ్మకం అనుకొంటా . అందుకే 1995 లో ముఖ్యమంత్రి అయ్యిన నాటి నుండి నేటి వరకూ హామీలు ఇవ్వడం, మేనిఫెస్టోలు రిలీజ్ చేయడం తప్ప ఒక్క హామీ కూడా సక్రమంగా నెరవేర్చిన చరిత్ర లేదు ఆయనకి . తాజాగా ఆ కోటాలో మరో మేనిఫెస్టో చేరింది.
2021 జనవరిలో స్థానిక పంచాయితీ ఎన్నికల నిమిత్తం భారత దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పంచాయితీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేశారు చంద్రబాబు. తాము గెలిచిన పంచాయితీలలో మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు అమలు చేసి గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం సాధించి చూపిస్తామని , అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థల్లో ఈ పథకాల ద్వారా సుపరిపాలన అందిస్తామని ఆ మేనిఫెస్టోలో ప్రవచించారు బాబు .
సదరు మేనిఫెస్టో పేరు పల్లె ప్రగతి -పంచ సూత్రాలు .
నిజానికి గ్రామ పంచాయితీ ఎన్నికలలో రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీల ప్రమేయం ఉండదు. ఆయా పార్టీలకు పంచాయితీ ఎన్నికలలో ప్రాతినిధ్యం వహించే హక్కు లేదు. స్థానిక పంచాయితీ నుండి పోటీ చేసిన అభ్యర్థికి మద్దతు తెలపవచ్చు . అలాంటి పంచాయితీ ఎన్నికలకు ఒక రాజకీయ పార్టీ మేనిఫెస్టో ప్రకటించడం నేరం, రాజ్యాంగ దిక్కరణ, చట్ట ఉల్లంఘన అవుతుంది. కానీ చంద్రబాబు రాజ్యాంగం, చట్టం, నిభందనలు ఏవీ పాటించినట్లు దాఖలాలు లేవనుకోండి.
ఆ కోవలోనే ఈ పంచాయితీ ఎన్నికల మేనిఫెస్టో కూడా విడుదల చేసి మూడేళ్లు అయ్యిన సందర్భంగా అందులోని అంశాలు ఒక్కొక్కటిగా చర్చించుకొందాం .
1 . సురక్షితమైన తాగునీరు : ప్రతి గ్రామంలో త్రాగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా ఇంటింటికీ సురక్షితమైన త్రాగు నీరు అందిస్తామని పేర్కొన్నారు .
ఎన్నికల అనంతరం ఎలెక్షన్ కమిటీ లెక్కలు ఏవైనా మేము 4230 స్థానాలు గెలుచుకొన్నామని స్వయంగా మీరే ప్రకటించారు . వైసీపీ లైట్లు ఆపేసి గుద్దుకోకపోతే ఇంకో పదిశాతం స్థానాలు గెలుచుకొనే వారమని కూడా ఆవేదన వ్యక్తం చేశారు . గెలుచుకున్న 4230 పంచాయితీలలో ఇప్పటికి ఎన్ని పంచాయితీలలో సురక్షిత త్రాగునీటి కేంద్రాలు నిర్మించారు . ఎన్ని కుటుంబాలకు రోజూ సురక్షిత త్రాగునీరు అందిస్తున్నారు .
నిజానికి టీడీపీ 4230 పంచాయితీలు గెలవలేదు. షుమారు 900 మంది టీడీపీ మద్దతు ఇచ్చిన వారు గెలిచారు అనేది క్షేత్ర స్థాయి సమాచారం . సరే స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ గుర్తుతో పోటీ చేయరు. ఫలానా పార్టీ మద్దతు దారులు గెలిచారు అని ఎన్నికల కమిషన్ ప్రకటించదు కాబట్టి 13200 పంచాయతీలు నేనే గెలిచాను అని చంద్రబాబు చెప్పుకొన్నా ఆశ్చర్యపోరు ప్రజలు.
ఈ మేనిఫెస్టో ప్రకటించి మూడేళ్లు అయ్యింది. ఇందులో చెప్పిన ప్రకారం తాను చెప్పినట్లు గెలిచిన 4230 గ్రామాల్లో ఒక్క గ్రామంలో అయినా త్రాగు నీటి శుద్ధి కేంద్రాలు ఓపెన్ చేసి ఇంటింటికి త్రాగు నీటి సరఫరా చేశారా అంటే రాష్ట్రంలో టీడీపీ గెలిచింది అని చెప్పుకొన్న ఏ ఒక్క గ్రామంలో కూడా అలా ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు . ఉదాహరణకు పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో పెద్దిరెడ్డిపాలెం గ్రామం నుండి పంచాయతీ ఎన్నికలలో టీడీపీ మద్దతుదారుడు గెలిచాడు. ఒకసారి ఆ గ్రామానికి పోయి పరిశీలించండి. ఎన్టీఆర్ పేరిట వాటర్ ప్లాంట్ లేదు, గ్రామంలో ఏ ఒక్క ఇంటికి సురక్షిత త్రాగునీరు సరఫరా చేసింది లేదు.
ఒకసారి గతంలోకి ఇంకొంచెం వెనక్కి వెళ్లి 2014 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో గుర్తు చేసుకొందాం . నాటి మేనిఫెస్టోలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరిట రాష్ట్రంలో ప్రతి గ్రామంలో , పట్టణ వార్డులలో సురక్షిత త్రాగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేసి 20 లీటర్ల మంచినీటి కేన్ 2 రూపాయలకే ఇంటింటికీ అందిస్తామన్నారు . అధికారంలోకి వచ్చాక ఆ ప్లాంట్లను ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. టీడీపీ నాయకులు, ఆర్ధికంగా బలంగా ఉన్న వారు ఉదార మనస్తత్వంతో ఉచితంగా ప్లాంట్ నిర్మించి ఆ ప్లాంట్ పై ఎన్టీఆర్ ఫొటోతో పాటు ఎన్టీఆర్ సుజల స్రవంతి అనే పేరు కూడా ప్రింట్ చేయిస్తే సంతోషిస్తాం అనే ప్రకటనతో సరిపుచ్చారు.
చరిత్రలోకి తొంగి చూస్తే బాబు మొదటిసారి సీఎం అయ్యిన 1995 నుండి నేటి వరకూ 14 ఏళ్ల బాబు పాలనా కాలంలో అతను హామీ ఇచ్చి మోసం చేసిన ఘటనలే తప్ప పూర్తి స్థాయిలో అమలు చేసినవి ఒక్కటి కనపడవు.