Home »andhra pradesh » The Governments Negotiations With The Trade Unions Have Ended
ఉద్యోగ సంఘాలతో ముగిసిన ప్రభుత్వ చర్చలు.
ఈ నెల 27న విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డులో ఉద్యోగ సంఘాలు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం నేపధ్యంలో, ప్రభుత్వం తరుపున నేడు ఉద్యోగ సంఘాలు జేఏసీల నేతలతో మంత్రివర్గ ఉప సంఘం చర్చలు జరిపింది.
ఈ నెల 27న విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డులో ఉద్యోగ సంఘాలు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం నేపధ్యంలో, ప్రభుత్వం తరుపున నేడు ఉద్యోగ సంఘాలు జేఏసీల నేతలతో మంత్రివర్గ ఉప సంఘం చర్చలు జరిపింది.
ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు రావాల్సిన బకాయిల విడుదల కోరుతూ సమ్మెకి పిలుపు నిచ్చిన ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపిన అనంతరం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగ సంఘాలు కోరినట్టే పెండింగ్ ఉన్న బకాయిలు చెల్లిస్తామని తెలిపారు. అయితే దీనికి గడువు మాత్రం మార్చ్ ఆఖరు వరకు ఉంటుందని చెప్పుకొచ్చారు. అలాగే పీఆర్సీ ఆలస్యమైతే ఐఆర్ కోసం ఆలోచిస్తామని చెప్పారు.
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల ఆశలని గౌరవించి గుర్తించే ప్రభుత్వమని , ఉద్యోగులకి తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగానే ఉంటుందని ఇవన్ని మనసులో ఉంచుకుని చలో విజయవాడను విరమించుకోమని ఉద్యోగ సంఘాలను కోరామని మంత్రి బొత్స తెలిపారు.