ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు ఐఎంజీ భరత(ఐఎంజీబీ) ప్రైవేట్ లిమిటెడ్కు కోట్లాది రూపాయల విలువ చేసే భూముల్ని కట్టబెట్టారు.
2003లో నాటి సీఎంగా ఉన్న చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు అయినా అహోబలరావు (బిల్లీరావు), ప్రభాకర రావు (పేటరావు)లు ఐఎంజీ భరత(ఐఎంజీబీ) అనే బోగస్ సంస్థను 2003 ఆగష్టు 5న 5లక్షల వర్కింగ్ కాపిటల్ తో ఏర్పాటు చేసారు.ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో క్రీడా ప్రాంగాణాలు పేరుతో ఏర్పాటు చేయడం.ఇందులో కొసమెరుపు ఏంటి అంటే ఐఎంజీ సంస్థకు ఐఎంజీ భరత సంస్థకు ఎటువంటి సంబంధం లేదు. ఐఎంజీ అనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఇలా క్రీడా మైదానాలు రేపుతూ చేయడంలో బాగా పేరుపొందిన సంస్థ.ఇదే విషయాన్ని ఫ్లోరిడాలో ఉండే ఐఎంజీ వెల్లడించిందని న్యాయవాది ఇమ్మనేని రామారావు తెలిపారు. అలాంటి సంస్థ పేరు ఉపయోగించుకొని బిల్లీరావు, పేటరావు భూమిని కొల్లగొట్టడానికి ఈ స్కాంకి తెరలేపారు.
కనీసం కార్యాలయం కూడా లేని ఈ సంస్థకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలు, మామిడిపల్లి గ్రామ సమీపంలోని 450 ఎకరాలను కేటాయిస్తూ రూపొందించిన 40 పేజీల అవగాహన ఒప్పందానికి ఆగస్టు 6న బాబు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. అంటే కంపెనీ ఏర్పడిన ఒక్క రోజులోనే ఒప్పంద రూపకల్పన తోపాటు ఆమోదం లభించింది. ఇక 9వ తేదీన సంబంధిత ఒప్పందంపై సంతకాలు పూర్తయ్యాయి. అంటే కంపెనీ రిజిస్టర్ చేసిన తేదీ నుంచి, ఒప్పందంపై సంతకాల వరకు మూడు రోజుల్లోనే ప్రభుత్వ పరంగా అన్ని వ్యవహారాలకూ ఆమోదం వచ్చింది. దాంతోపాటు ఆ సంస్థకు రకరకాల రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తూ బాబు జీవోలు విడుదల చేశారు. అక్కడితో ఆగిపోయిన ఆ ప్రాజెక్ట్ ను మల్లి ఆఘమేఘాల మీద చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో 2004 ఫిబ్రవరిలో సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని ఐఎంజీకి విక్రయిస్తూ ఆగమేఘాలపై చంద్రబాబు రిజిస్టర్ చేయించారు. అప్పట్లో 3 కోట్లు ఎకరం ఉన్న భూమిని రూ. 50 వేలకే ఇచ్చేసాడు. ఇందులో కొసమెరుపు ఏంటి అంటే వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్/మేనేజింగ్ కమిటీ ఆ భూము లకు చట్టబద్ధమైన యజమానులైనప్పటికీ కనీసం సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కు సమాచారం ఇవ్వకపోవడం. మరో 450 ఎకరాలు సంబంధించి శంషాబాద్ సమీపంలోని మామిడిపల్లిలో భూములను ఎకరం రూ.50 వేలకే(రిజిస్టేషన్ సమయంలో రూ.25 వేలు మాత్రమే చెల్లించేలా) ఐఎంజీకి విక్రయించేందుకు నిర్ణయించారు. వాస్తవానికి అక్కడ ఎకరం విలువ రూ. కోటి ఉంది.
ఐఎంజీ భరత సంస్థ ఏర్పాటు తేదీల నుంచి మొదలు, ఒప్పందంలోని క్లాజుల వరకు అన్ని విషయాల్లోనూ అక్రమాలు స్పష్టంగా కనిపిస్తు న్నాయి. అన్ని విధాలా ఐఎంజీ సంస్థకే ప్రయోజనాలు చేకూ రేలా, ప్రభుత్వ ఖజానాకు పూర్తి స్థాయి నష్టాలు జరిగేలా చంద్రబాబు వ్యవహరించారన్నది ఇందులో స్పష్టమవుతోంది. చంద్రబాబు 2004 ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు.
2004లో ఆంధ్రప్రదేశ్ కు వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ లో జరిగిన అవకతవకలు, కుంభకోణం గుర్తుంచి ఐఎంజీ భరత సంస్థకి ఇచ్చిన జిఓ ను 2006లో రద్దు చేసారు. జిఓ రద్దు చేసిన తర్వాత ఐఎంజీ భరత సంస్థ కోర్టు మెట్లు ఎక్కింది. ప్రభుత్వం 2007లో ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ జీవో విడుదల చేసింది. కానీ సీబీఐ మాత్రం దీనిపై దర్యాప్తు జరపడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. చంద్రబాబును దోషిగా . రుజువు చేసేందుకు సకల సాక్ష్యాలూ కళ్ల ముందు కనిపిస్తున్నా చంద్రబాబును విచారించడానికి గానీ, అరెస్టు చెయ్యటానికి గానీ సీబీఐ ముందుకెళ్లలేదు. మా దగ్గర తగినంత సిబ్బంది లేరు. తగిన వనరులు లేవు. అందుకని దర్యాప్తు జరపలేం” అని ప్రభుత్వానికి సమాధానమిచ్చి తప్పించుకుంది.
విచిత్రమేంటంటే అప్పుడు కూడా రాష్ట్రంలో సీబీఐ ఇన్ఛార్జిగా ఉన్నది సిబిఐ జాయింట్ డైరెక్టర్ వి.వి.లక్ష్మీనారాయణ యే , జగన్ కేసులో అత్యుత్సాహం ప్రదర్శించిన వి.వి.లక్ష్మీనారాయణ , చంద్రబాబు కేసు సమాయంలో కూడా అలానే ప్రవర్తించాలి కదా , అలా ఎందుకు జరగలేదు . అసలు ఆయనకు బాబుపై ఎందుకు అంత ప్రేమ? నేరం స్పష్టంగా కనిపిస్తున్నా… దొంగలెవరో ఆధారాలతో సహా తేలినా పట్టుకోవటానికి ఎందుకు తాత్సారం చేశారు? తగిన వనరులు లేవన్న కారణంతో విచారణ జరపలేమని చెప్పటం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? దొంగల్ని పట్టుకోవటానికి పోలీసులు లేరంటే… ఈ వ్యవస్థెందుకు ? ఈ దర్యాప్తు సంస్థలెందుకు?
కోట్లాది రూపాయల విలువైన భూముల్ని అప్పటి ఉమ్మడి ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు ఐఎంజీ భరత(ఐఎంజీబీ) ప్రైవేట్ లిమిటెడ్కు కట్టబెట్టారని, ఈ వ్యవహారంలో చంద్రబాబు, కంపెనీపై ప్రాసిక్యూషన్ చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఐజీకి న్యాయవాది ఇమ్మనేని రామారావు వినతిపత్రం అందజేశారు. కోట్లాది రూపాయల విలువైన 850 ఎకరాలను ఐఎంజీ–భరత కంపెనీకి ఇవ్వడం వెనుక కుట్ర, మోసం, అధికార దుర్వినియోగం, అవినీతి ఉందని ఆయన ఆరోపించారు. ఇందుకు కీలక పాత్రధారి అయిన అప్పటి ఉమ్మడి ఏపీ ఆపద్ధర్మ సీఎం, ప్రస్తుత ఏపి ప్రతిపక్ష నేత చంద్రబాబు తనకు సన్నిహితుడైన బిల్లీరావు,ప్యాట్రో లకు చెందిన ఐఎంజీబీ కంపెనీకి అప్పనంగా భూములు రిజిస్ట్రేషన్ చేయించారని వివరించారు. భూముల రిజిస్ట్రేషన్లకు కూడా చంద్రబాబు ప్రభుత్వం రాయితీలు ఇచ్చిందని, చంద్రబాబు బినామీ కంపెనీలకు భూములు ఇచ్చారని, ఇందుకు కారణమైన ఆ ముగ్గురిని ప్రాసిక్యూట్ చేయాలని కోరారు. కేవలం 8 రోజుల కంపెనీకి, రూ.5 లక్షల షేర్ క్యాపిటల్ ఉన్న కంపెనీకి కోట్లాది రూపాయల హైదరాబాద్ భూముల్ని ఇచ్చేసే కుట్రకు కారణమైనవారిని వదిలిపెట్టడానికి వీల్లేదన్నారు. కాబట్టి సీబీఐ, ఈడీ చేత సమగ్ర విచారణ జరిపిస్తేనే దోషులు బయటపడతారని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినవారికి తగిన శిక్ష పడుతుందని న్యాయస్థానాన్ని అభ్యర్థిస్తున్నాం.
కాగా నిన్న విచారనుకు వచ్చిన ఈ కేసు ఐఎంజీ భారత కు బాబు భూ కేటాయింపులను హై కోర్ట్ తప్పుపట్టింది. ఏకపక్షంగా అంత భూమిని అప్పగించడంలో ప్రభుత్వంలోనూ దోషులున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 2006లో సేల్ డీడ్ ను రద్దు చేయటాన్ని కోర్టు ప్రస్తావిస్తూ… భూములను వెనక్కి తీసుకున్న ప్రభుత్వం దీనికి కారకులైన అధికారులు, నాయకులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది.. తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఏ.సుదర్శన్రెడ్డి సుదీర్ఘ వాదనలు వినిపించారు.