2003లో సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితులు అయినా అహోబలరావు (బిల్లీరావు), ప్రభాకర రావు (పేటరావు)లు ఐఎంజీ భరత(ఐఎంజీబీ) అనే బోగస్ సంస్థను స్థాపించారు.ఐఎంజీ భరతను 2003 ఆగష్టు 5న 5లక్షల వర్కింగ్ కాపిటల్ తో ఏర్పాటు చేసారు.ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో క్రీడా ప్రాంగాణాలు ఏర్పాటు చేయడం అని ప్రకటించుకొన్నారు .ఐఎంజీ అనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఇలా క్రీడా మైదానాలు ఏర్పాటు చేయడంలో బాగా పేరుపొందిన సంస్థ. ఐఎంజీ సంస్థకు ఐఎంజీ భరత సంస్థకు ఎటువంటి సంబంధం లేదు అనే విషయాన్ని ఫ్లోరిడాలో ఉండే ఐఎంజీ సంస్థ గతం లోనే వెల్లడించింది .
అలాంటి ప్రముఖ సంస్థ పేరు ఉపయోగించుకొని బిల్లీరావు, పేటరావు చంద్రబాబు సహకారంతో భూమిని కొల్లగొట్టడానికి ఈ స్కాంకి తెరలేపారు. చంద్రబాబు 4 రోజులు వయసున్న ఈ సంస్థకు 850 ఎకరాలు కట్టబెట్టడానికి సిద్ధం అయిపోయి ఒప్పంద పాత్రలు పైన సంతకాలు చేసుకొని 850 ఎకరాలకు సంబంధించి సేల్ డీడ్ కూడా చేసేసాడు అది కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో.
2004లో అధికారంలోకి వచ్చిన వైయస్ రాజశేఖర్ రెడ్డి ఈ స్కాం గురుంచి తెలుసుకొని ఐఎంజీ భరత అనే సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసింది ప్రభుత్వం. ఒప్పందం రద్దు కావడంతో బిల్లీ రావ్, పేట రావు అప్పటి ఉమ్మడి హై కోర్ట్ లో ఒప్పందం రద్దును సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ విచారణకు వచ్చిన నేపథ్యంలో గౌరవ హై కోర్ట్ అప్పటి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం చేసింది కరెక్ట్ అని , చంద్రబాబు చేసిన దుర్మార్గపు చర్యను దుయ్యపట్టింది. అసలు నాలుగు రోజులు వయసునా కంపెనీకి అని ఎకరాలు ఎలా కట్టబెడతారు అని ప్రశ్నించింది?
నిన్న విచారణకు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు తెలంగాణ సర్కార్ సూటి ప్రశ్నలు వేసింది. ఐ ఎం జి భారతతో ఒప్పందంపై సిబిఐ విచారణ మీరు జరిపిస్తారా? లేదా మమ్మల్ని ఆదేశించమంటారా అని ప్రశ్నించింది, సిబిఐ విచారణపై వారంలోపు తమకు సమాధానం తెలిపాలని తెలిపింది. ఖరీదైన ప్రాంతంలో వేల కోట్ల విలువైన భూములను కారు చౌకగా దారతుత్వం చేస్తారా? అబద్ధర్మ ప్రభుత్వంలో 850 ఎకరాలకు సేల్ డీడ్ ఎలా చేస్తారు? గతంలో ఏ కంపెనీకి నాలుగు రోజుల్లోనే వందలు ఎకరాల అప్పగించినట్లు గాని ఖర్చులు ,బిల్లులు మాఫీకి అంగీకరించినట్టుగా చూడలేదు? అసలు ఐ ఎం జి భారత్ కు ఏ అంతర్జాతీయ కంపెనీతో సంబంధాలు లేవు, ఆ కంపెనీకి గతంలో క్రీడారంగంలో అనుభవం లేదు అలాంటి కంపెనీకి ఏ కోలమానంతో భూములు కేటాయించాలని ప్రశ్నించింది. ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని వైఎస్ ప్రభుత్వం ఆ భూముల వెనక్కి తీసుకుంటూ చట్టం చేసింది. పిటీషన్ లో ఎలాంటి మెరిట్ లేదు ఆ ఒప్పందాన్ని ఏ రకంగా సమర్ధించలేం అంటూ 18 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత తెలంగాణ చీఫ్ జస్టిస్ తో కూడిన ధర్మాసనం ఐఎంజి భారత పిటిషన్ ని కొట్టివేసింది.