వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో చాలామంది మా వైపు ఉన్నారు. రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థిని పోటీలో పెట్టి గెలుస్తామని ప్రగల్బాలు పలికిన తెలుగుదేశం చివరికి తోక ముడిచింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో చాలామంది మా వైపు ఉన్నారు. రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థిని పోటీలో పెట్టి గెలుస్తామని ప్రగల్బాలు పలికిన తెలుగుదేశం చివరికి తోక ముడిచింది. సంఖ్యా బలం లేకపోవడంతో చంద్రబాబు చేతులెత్తేశారు. బుధవారం ఆయన ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. పోటీ వద్దని.. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఓటు వేయరని నాయకులు స్పష్టంగా చెప్పారు. దీంతో బాబు వెనక్కి తగ్గారు. కాగా పార్టీ స్థాపించినప్పటి నుంచి తొలిసారి రాజ్యసభలో ఉనికి కోల్పోనుంది. 41 ఏళ్ల ఆ పార్టీ చరిత్రలో రాజ్యసభ స్థానం గల్లంతు కాబోతోంది.
ప్రస్తుతం సభ్యులుగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, సీఎం రమేష్, కనకమేడల రవీంద్రకుమార్ రిటైర్ కానున్నారు. ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. వైఎస్సార్సీపీకి 151 మంది ఎమ్మెల్యేలున్నారు. దీంతో రాజ్యసభ అభ్యర్థులుగా గొల్ల బాబూరావు, వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డిను బరిలోకి దించింది. వారు నామినేషన్లను దాఖలు చేసింది. చంద్రబాబు తాను అభ్యర్థిని నిలబెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఏ మాత్రం బలం లేకపోయినా ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారు.• ఓటుకు కోట్లు వెచ్చిస్తే తెలంగాణ చేదు అనుభవం తప్పదని భయపడ్డారు. దీనికితోడు సొంత పార్టీ ఎమ్మెల్యేలు పొత్తుల విషయంలో నారా వారి తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. సీనియర్ నాయకులు కూడా పరువు పోగొట్టుకోవద్దని చెప్పడంతో చివరి నిమిషంలో పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే దీనికి ఆయన చెప్పిన సాకు.. అసెంబ్లీ ఎన్నికలే ముఖ్యమని.. టీడీపీ ప్రాతినిధ్యం లేకపోవడంతో పెద్దల సభ చాలా హుందాగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.