రాజంపేట బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ప్రకటన తర్వాత ప్రచారం ఆపేసిన అన్నమయ్య జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థులు. ఎన్నికల ప్రక్రియ మొదలైతే చాలు గతంలో జరగని సంఘటనలు బోలెడు చూస్తూనే ఉంటాం, కానీ ఇది అన్నిటికంటే భిన్నమైంది అని చెప్పొచ్చు. కూటమి పొత్తులో భాగంగా బీజెపీ రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి కిరణ్ కుమార్ రెడ్డిని ప్రకటించింది. అభ్యర్థి ప్రకటన జరిగిన వెంటనే రాజంపేట పార్లమెంట్ పరిధిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు మూకుమ్మడిగా ప్రచారం ఆపేశారు.
పార్లమెంట్ సీటు బీజేపీకి ఇవ్వడంతో ఆ ప్రభావం ఎమ్మెల్యే అభ్యర్థుల పైన తీవ్రంగా పడే అవకాశం ఉండటంతో ప్రచారం ఆపేసిన అసెంబ్లీ అభ్యర్థులు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇలా జరగడం బహుశ మొదటి సారి కావచ్చు.
ఆంధ్ర ప్రదేశ్ లో రాజంపేట పార్లమెంట్ పరిధిలో ముస్లిమ్ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు, వీరి తర్వాత బలిజలు 2.50 లక్షల మంది ఓటర్లు ఉండటంతో, వీరి ఓట్లు పడవు అనే ఆందోళనలో ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు. బీజెపీ ముస్లింలకు వ్యతిరేఖం అని తెలుసు, బలిజలు ఎందుకు వోట్ వేయరు అంటే గతంలో ఈ స్థానాన్ని బలిజలకు కేటాయిస్తామని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తెలిపారు. రాజంపేట అసెంబ్లీ స్థానం బలిజలకు కేటాయిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ఇటీవల కూడా ప్రకటన చేశారు . చివరికి అటు పార్లమెంట్ కానీ, ఇటు అసెంబ్లీ స్థానం కానీ బలిజలకు ప్రకటించలేదు.
ముస్లిమ్ ఓటు బ్యాంకు పీలేరు, రాయచోటి, మదనపల్లి తంబళ్లపల్లి నియోజకవర్గాలలో తీవ్ర ప్రభావం చూపనుంది.బలిజలు రాజంపేట, రైల్వే కోడూరు నియోజక వర్గాలలో అధికంగా ఉన్న వారి ఓట్లు కోల్పోయే అవకాశం ఉన్నట్లు పార్లమెంట్ పరిధిలోనే ఎమ్మెల్యే అభ్యర్థులు వాపోతున్నారు.