పెదకూరపాడు మాజీ టీడీపీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా డాన్ గా పేరు తెచ్చుకున్న విషయం అందరికి తెలిసిందే. ఉచిత ఇసుక పేరుతో కృష్ణ నదిని తవ్వేసారు. కృష్ణమ్మ నది గర్భం లో డ్రెడ్జీర్ తో భారీ లోతుగా ఇసుక తవ్వేయడం వల్ల ,వాటిలో మునిగి అయిదు మంది అమాయకులు కూడా ప్రాణాలు కోల్పోయారు. చిన్న బాబు లోకేష్ కు భారీగా డబ్బు ముట్టడంతో ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడితనంగా ఇసుక దోపిడీకి ఎలా గురి అయిందో అందరికీ తెలిసిన విషయమే. కానీ జగన్ ప్రభుత్వం వచ్చాక ఇసుక మాఫియా చేస్తున్న ఆగడాలను అరికట్టి ఇసుక అమ్మకాలను పారదర్శకంగా ప్రభుత్వమే అమ్మేలాగా విధానాలును చేపట్టింది. ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే ఇసుకను ఇంటి దగ్గర కు చేరే విధానం ప్రభుత్వం చేపట్టింది. గతంలో దళారీ వ్యవస్థ ఉన్నప్పుడు డిమాండ్ బట్టి వాళ్ళు చెప్పిందే రేటు అన్నట్లుగా ఉండేది. సామాన్యులు ఇసుక కొని ఇళ్లు కట్టే పరిస్థితి లేకుండా చేసిన ఆ దళారీ వ్యవస్థను లేకుండా చేసి సాధారమైన అతి తక్కువ రేట్ కే ఇసుక అందిస్తూ సామాన్యుల పక్షాన జగన్ ప్రభుత్వం నిలబడింది.
నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ ఎంపీగా 2019లో గెలిచిన లావు కృష్ణదేవరాయలు 2024 లో నరసరావుపేట ఎంపీ సీట్ నిరాకరించడంతో ఇటీవల వైసీపీ కి , తన ఎంపీ అభ్యర్థిత్వానికి రాజీనామా చేసి తెలుగు దేశం పార్టీలో చేరడానికి సిద్దం చేసుకున్న తరుణంలో తనతో పాటు తన పార్లమెంట్ పరిధిలోని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్ ను తెలుగుదేశంలో చేరమని కోరాడు. ఎమ్మెల్యే శంకర్ తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి సముఖత చూపలేదు. దీనితో కృష్ణ నదిని మింగేస్తున్న శాండ్ శంకర్ అంటూ తమ ఆస్థాన పత్రికలో రాసుకొని టీడీపీ శునకానందం పొందుతుంది .