ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ పరిస్థితి రోజురోజుకీ అధ్వానం గా తయారవుతుంది. ప్రతీ మూడు రోజులకి ఒకసారి టీడీపీ-జనసేన పొత్తుపై సమీక్ష అంటూ, ఇదిగో పొత్తు పంపకాలు అదిగో పొత్తులో సీట్ల ప్రకటన అంటూ ఎటూ తేల్చుకోలేక మల్లగుల్లాలు పడుతున్నారు.. ఎప్పుడో ప్రకటించిన టీడీపీ-జనసేన పొత్తు లో కూడా ఇంతవరకు సీట్ల పంపకం పై స్పష్టత లేక, ఇంకా ఎన్నికలు జరగకుండానే అప్పుడే రోజుకో మనస్పర్థలతో రెండు పార్టీ ల మధ్య లోలోపల ఒక యుద్ధమే జరుగుతుండగా, మరోవైపు బీజేపీ తో పొత్తు కుదురుతుందా లేదా అని బాబు పడే ఆందోళన అంతా ఇంతా కాదు.
ఈ నేపథ్యంలో బాబులో పెరిగిన అభద్రతాభావం వలన టీడీపీ లో ముఖ్యనేతలు పార్టీ ని వీడే ఆలోచనలో ఉన్నారు… తాజాగా చింతలపూడి టికెట్ ఆశించిన పీతల సుజాత కు టికెట్ ఇస్తారా లేదా అన్న విషయంలో స్పష్టత ఇవ్వకపోవడంతో ఆమె పార్టీ వీడనున్నట్లు సమాచారం…
ఇక టీడీపీ వ్యవస్థాపక సభ్యుడైన, టీడీపీ లో బాబుకన్నా సీనియర్ అయిన బుచ్చయ్య చౌదరికీ రాజమండ్రి సీటు కేటాయించబోవడం లేదని సూచనలు అందడంతో ఆయన తన అసంతృప్తిని వ్యక్తపరిచిన విషయం విధితమే. మరో సీనియర్ నాయకుడు దేవినేని ఉమకు మైలవరం టికెట్ కేటాయిస్తారా లేదా అనే విషయంలో కూడా స్పష్టత లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు.. చిలకలూరిపేట టికెట్ పత్తిపాటి పుల్లారావుకు ఇవ్వబోవడం లేదని ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.. ఇక అలపాటి కి టికెట్ లేదని చెప్పడం గుంటూరు నుండి పార్లమెంట్ స్థానానికి పోటీ చేయమనడంతో ఆయన అనాసక్తత చూపిస్తున్నారు… మరో సీనియర్ నాయకుడు గంటా కి కూడా తనకు ఏ మాత్రం పట్టులేని చీపురుపల్లి నుండి పోటీ చేయమని బాబు ఒత్తిడి చేస్తున్నాడు, పోతే వెంట్రుక వస్తే కొండ అన్నట్లుగా ఓడిపోతే గంటను వదిలించుకోవచ్చు అనే భావనలో బాబు ఉన్నాడని రాజకీయ వర్గాల్లో గుసగుసలు..
ఇక నూజివీడు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ ముద్దరబోయిన కి కూడా టికెట్ లేదని చెప్పడంతో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు, పార్టీ వీడనున్నట్లు కూడా లీక్ ఇచ్చి తర్వాత వెనక్కితగ్గారు..
ఇలా రాష్ట్రం అంతా టీడీపీ నాయకత్వంలో ఎన్నడూ లేని సందిగ్ధత నెలకొంది.. తీరా చూస్తే ఎన్నికలు మరో నెలన్నర లోపే ఉండబోవచ్చు అన్న సంకేతాలు అందుతుండగా ఇంకా ఏ నియోజవర్గంలో ఎవరు ఇంచార్జ్ అనే స్పష్టత కూడా లేకుండా కానీసం పోటీ చేసే తయారీలో కూడా టీడీపీ ప్రస్తుతం లేనట్లుగా అర్థం అవుతుంది..
40 ఏళ్ల అనుభవం ఉన్న బాబు యువకుడైన జగన్ యొక్క రాజకీయ వ్యూహాల ముందు చేతులెత్తేసినట్లు గా స్పష్టం అవుతుంది.. సామాజిక సమీకరణాలు, బీసీ లకు అధిక సీట్లు కేటాయించడం, నియోజకవర్గాల ఇంచార్జ్ ల మార్పు అంటూ జగన్ వేస్తున్న ఎత్తుల ముందు బాబు బోల్తా కొడుతున్నాడు.
ఈ నేపద్యం లో ఈసారి బాబు పోటీ ఇవ్వడం కాదు కనీసం పోటీ అయినా చేస్తాడా అనే అనుమానం ప్రజల్లో కలుగుతుంది…