టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ అరెస్ట్ అయ్యాడు. జీఎస్టీ ఎగవేశారన్న ఆరోపణలతో ఆయనపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అవెక్సా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నడుపుతున్న శరత్, ఎన్నికల వేళ మనీలాండరింగ్ మరియు జిఎస్టి పన్ను ఎగవేత కేసులో ఇరుక్కుని అరెస్ట్ కావడం చిలకలూరిపేట అభ్యర్ధిగా బరిలో ఉన్న మాజీ మంత్రి సీనియర్ టీడీపీ నేత పత్తిపాటి పుల్లారావుకి కోలుకోలేని దెబ్బగానే చూడాలి.
ప్రత్తిపాటి పుల్లారావు నుండి ఇంకా తన కుమారుడి అరెస్టుపై ఎలాంటి ప్రకటన రాలేదు. ఆది నుండి పుల్లారావు కుటుంబంపై అవినీతి ఆరోపణలు తరుచూ వస్తూనే ఉంటాయి. తెలుగుదేశం పాలనలో నీరు – చెట్టు, పత్తి కొనుగోలులో గోల్మాల్, గ్రావెల్, అగ్రిగోల్డ్ భూములు అంటూ ఐదేళ్ల పాలనలో వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేశారనే తీవ్రమైన ఆరోపణలు పుల్లారావు మూట కట్టుకున్నారు. ఈ పాపంలో పుల్లారావు భార్యకు సైతం వాట ఉందనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పుల్లారావు కుమారుడు సైతం మనీలాండరింగ్ మరియు జిఎస్టి పన్ను ఎగవేత కేసులో అరెస్ట్ అవ్వడం చిలకలూరిపేట రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.